News April 20, 2024

HYD: కండక్టర్ నుంచి చిల్లర తీసుకోవడం మరిచారా? ఇలా చేయండి!

image

RTC బస్సులో ఒక్కోసారి కండక్టర్ టికెట్ ఇచ్చిన తర్వాత వెనక రాసిన చిల్లర తీసుకోవడం మర్చిపోతుంటారు. అలాంటి సంఘటన RR జిల్లా హయత్ నగర్ పరిధిలో జరిగింది. రూ.500 నోటును కండక్టర్‌కు ఇవ్వగా రూ.60 టికెట్ ఇచ్చి, మిగితా రూ.440 బస్ దిగేటప్పుడు ఇస్తానని టికెట్ వెనుక రాశాడు. అయితే సదరు ప్రయాణికుడు మర్చిపోయి RTC ఉన్నతాధికారులను సంప్రదించగా.. రూ.440 ఫోన్ పే చేశారు. మీకు ఇలా జరిగితే 040-69440000 సంప్రదించండి.

Similar News

News October 1, 2024

రంగారెడ్డి కోర్టులో జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ

image

రంగారెడ్డి జిల్లా కోర్టులో లైంగిక ఆరోపణల కేసులో అరెస్టయిన జానీ మాస్టర్‌ మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు అయ్యింది. జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై నేడు రంగారెడ్డి కోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే జానీ మాస్టర్‌ను 4 రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని పోలీసులు విచారించారు. జానీ మాస్టర్‌ఫై అత్యాచార కేసుతో పాటు ఫోక్సో కేసు నార్సింగ్ పోలీసులు నమోదు చేశారు.

News October 1, 2024

HYD: హైడ్రాను రద్దు చెయ్యాలని హైకోర్టులో పిటిషన్

image

హైడ్రా జీవో నెంబర్ 99ను రద్దు కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. హైడ్రా కోసం తీసుకొచ్చిన జీవోను కొట్టేయాలని 2 వేర్వేరు పిటిషన్లు దాఖాలు అయ్యాయి. పిటిషన్‌పై నేడు తెలంగాణ హైకోర్టు విచారణ చేయనుంది. హైడ్రాకు చట్టబద్ధత లేదని, జీవో నెంబర్ 99ను వెంటనే రద్దు చేయాలను కోరుతూ పిటీషన్ దాఖలు కావడంతో దీని తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

News October 1, 2024

రాజస్థాన్‌లో HYD పోలీస్ ఆపరేషన్ SUCCESS

image

రాజస్థాన్‌లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. రాజస్థాన్ కేంద్రంగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్న కేటుగాళ్లకోసం రిక్కీ నిర్వహించారు. పక్కా ప్లాన్‌తో వారి స్థావరాలపై మెరుపుదాడి చేసి 27 మందిని అరెస్ట్ చేశారు.