News August 28, 2024

HYD: కరెంట్ షాక్ తగిలి చనిపోతే..?

image

గ్రేటర్ HYD పరిధిలో వర్షాకాలం వేళ కరెంట్ స్తంభాలు, తీగల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ దురదృష్టవశాత్తు..
✓విద్యుదాఘాతంతో మృతిచెందిన కుటుంబానికి పరిహారాన్ని రూ.2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచారు ✓శాశ్వత అంగవైకల్యానికి గురైతే రూ.5 లక్షలు
✓తీవ్రంగా గాయ పడితే రూ.లక్ష, స్వల్పంగా గాయపడితే రూ. 25 వేలు చెల్లిస్తారు
✓ప్రమాద బాధితులకు వైద్య ఖర్చులు కూడా అందిస్తారు. ✓ఆస్తినష్టం జరిగినా పరిహారం చెల్లిస్తారు.

Similar News

News February 23, 2026

RR: ఉగ్గుపాల నుంచే ఒగ్గు కథల వైపు మల్లారి!

image

ఒగ్గు కథ చెప్పడం మగాళ్లకే పరిమితమైన రోజుల్లో ఓ మహిళ కథ చెప్పడానికి బయలుదేరింది. రంగారెడ్డి(D),యాచారం(M), నక్కర్త మేడిపల్లికి చెందిన జమ్మ మల్లారి. ఈమె వేలకొద్దీ బీరప్ప కళ్యాణాలు చేసి, ఒగ్గు కథలు వినిపించి ఒగ్గుకథ ‘సూపర్‌స్టార్‌’గా ఎదిగారు. జీవితాన్ని ఒగ్గుకథకు అంకితం చేసి తొలి మహిళా ఒగ్గు కథా కళాకారిణిగా పేరుగాంచి 2020లో విశిష్ట మహిళా పురస్కారాన్ని అందుకుని FEB 7న ఆమె శివైక్యం చెందారు.

News February 23, 2026

రంగారెడ్డి: ఇంటర్ పరీక్షలకు 200 కేంద్రాలు..!

image

ఈనెల 25 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలో 200 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు అధికారి వెంక్యానాయక్ తెలిపారు. 84,301 మంది ప్రథమ సంవత్సరం, 70,171 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఉ.9 గంటల నుంచి మ.12 గంటల వరకు పరీక్ష ఉంటుందని, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.

News February 21, 2026

RR: వారికి 100% రాయితీతో రూ.60వేలు

image

రాళ్లు కత్తిరించే వృత్తిలో అనుభవం ఉన్న ముస్లింలకు పునరావాసం, జీవనోపాధి కల్పిస్తున్నట్లు జిల్లా మైనారిటీ శాఖ అధికారి నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. లబ్ధిదారుడికి రూ.60 వేల చొప్పున, రూ.10 వేల విలువైన టూల్ కిట్, రూ.50 వేల విలువైన జనరేటర్‌ను 100% సబ్సిడీ కింద అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే నెల 1 వరకు http://tsobmms.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.