News May 4, 2024

HYD: కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి: KTR

image

ఆరు గ్యారంటీల పేరిట ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌కు ఓటుతోనే బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి KTR పిలుపునిచ్చారు. ఈరోజు సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ పరిధి అన్నానగర్‌లో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొని మాట్లాడారు. కంటోన్మెంట్‌లో నివేదిత, మల్కాజిగిరిలో రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలని కోరారు. హామీలు అమలు చేయకముందే.. చేసినట్లు మెట్రో పిల్లర్లకు బ్యానర్లు కట్టడం ఏంటని కాంగ్రెస్‌ను ప్రశ్నించారు. 

Similar News

News October 14, 2024

HYD: రాడార్ ఏర్పాటుకు BRS వ్యతిరేకం: KTR

image

ఓ వైపు మూసీ నదికి CM మరణశాసనం రాస్తూ.. మరోవైపు సుందరీకరణ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తారా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. 10 ఏళ్ల పాలనలో తమపై రాడార్ స్టేషన్ నిర్మాణానికి ఎంత ఒత్తిడి తెచ్చినా అంగీకరించలేదని, జనావాసాలు లేని ద్వీపాల్లో ఏర్పాటు చేయాల్సిన రాడార్‌ను తెలంగాణలో ఏర్పాటు చేస్తారా అంటూ ప్రశ్నించారు. రాడార్ ఏర్పాటుకు వ్యతిరేకంగా పర్యావరణవేత్తలతో కలిసి BRS పోరాటం చేస్తుందన్నారు.

News October 14, 2024

HYD: విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: ఈటల 

image

సికింద్రాబాద్‌లో <<14353764>>ముత్యాలమ్మ విగ్రహాన్ని<<>> ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని BJP మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదన్నారు. దాడిచేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యక్తులు, శక్తులపట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని.. లేదంటే జరిగే పరిణామాలకు రేవంత్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

News October 14, 2024

HYD: దుర్గాదేవి లడ్డూ వేలం.. @ రూ.5,02,116

image

సాధారణంగా గణేశ్ లడ్డూ వేలం మీరు వినే ఉంటారు.. కానీ ఆ గ్రామంలో దుర్గాదేవి లడ్డూ వేలం నిర్వహించారు. ఆశ్చర్యంగా ఉంది కదూ.. RR జిల్లా మాడుగులలో అమ్మవారి విగ్రహం వద్ద లడ్డూ ప్రసాదం పెట్టి, నవరాత్రులు పూజలు చేశారు. అనంతరం ఆదివారం వేలం వేయగా స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారి సూదిని నారాయణ్ రెడ్డి రూ.5,02,116కు లడ్డూను దక్కించుకున్నారు. చీరలు, ముక్కుపుడక ఇలా అన్నింటి వేలం పాటతో మొత్తం రూ.10,85,000 వచ్చాయి.