News October 14, 2025

HYD: ‘కాంగ్రెస్ గెలిస్తే జూబ్లిహిల్స్‌‌పై వరాల జల్లు’

image

HYD జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అటు BRSతోపాటు ఇటు కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇక్కడి ఫలితాల ప్రభావం ఆ తర్వాత వచ్చే ఎలక్షన్లపై ఉంటుందని, క్షేత్రస్థాయిలో నాయకులు పర్యటించి కాంగ్రెస్‌ను భారీ మెజార్టీతో గెలిపించేలా చూడాలని ఇప్పటికే CM రేవంత్ రెడ్డి సూచనలు చేశారు. కాంగ్రెస్ గెలిస్తే జూబ్లిహిల్స్‌‌పై CM వరాల జల్లు కురిపిస్తారంటూ శ్రేణులు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నాయి. దీనిపై మీ కామెంట్?

Similar News

News October 14, 2025

అమ్మో కోఠి ENT.. ఇకనైనా మారుతుందా..?

image

దశాబ్దాల చరిత్ర కలిగిన HYD కోఠి ప్రభుత్వ ENT ఆస్పత్రి ప్రస్తుతం రోగులు, వైద్య సిబ్బందికి నరకంగా మారింది. ఆస్పత్రి ఆవరణ, వార్డుల్లోకి సమీప మురుగు నీరు రావడంతో ప్రాణాలను నిలబెట్టాల్సిన చోటే అపరిశుభ్రత, తీవ్ర దుర్వాసన రాజ్యమేలుతోంది. దీంతో తెలంగాణ మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్(TGMSIDC) నూతన సమీకృత భవన నిర్మాణానికి రూ. 24.38 కోట్ల టెండర్‌ను ఆహ్వానించగా 18 నెలల్లో ఆసుపత్రిని ఆధునికీకరించనుంది.

News October 14, 2025

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. సినీ ప్రముఖులతో రహస్య చర్చలు!

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్, BRS, BJPకి పెద్ద సవాలు. ఓటర్లను ఆకర్షించడానికి ప్రధాన పార్టీలు రాజకీయ నాయకులు కొందరు సినీ నటులతో రహస్య సమావేశాలు నిర్వహించి, తమకు మద్దతుగా ప్రచారం చేయమని ఆహ్వానించడంలో బిజీగా ఉన్నారు. చిరంజీవి, నాగార్జున, అల్లు అర్జున్, జూ.NTR,రామ్ చరణ్ వంటి అనేక మంది సినీ ప్రముఖులు, నిర్మాతలు, దర్శకులు ఇక్కడి ఓటర్లు. ప్రచారం చివరి వారంలో కొందరు సెలబ్రెటీలు ప్రచారంలో పాల్గొంటారు.

News October 14, 2025

HYD: చనిపోయిన మహిళ వివరాలు గుర్తింపు

image

HYD మీర్‌పేట్ చందన (మంత్రాల) చెరువులో <<18001273>>మహిళ మృతదేహాన్ని<<>> బడంగ్‌పేట్ మమతానగర్ కాలనీకి చెందిన యాదమ్మ అలియాస్ కమల (50)గా పోలీసులు గుర్తించారు. 3 రోజుల క్రితం ఆమె మిస్సింగ్ కేసు నమోదైనట్లు సమాచారం. కొంతకాలంగా ఆరోగ్యం బాగాలేక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హైడ్రా బృందం సహాయంతో మృతదేహాన్ని చెరువులో నుంచి బయటకు తీసి ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు మీర్‌పేట్ పోలీసులు తెలిపారు.