News August 10, 2025
HYD: కారు బోల్తా పడి సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి

కారు బోల్తాపడడంతో సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి చెందిన ఘటన రాయదుర్గం PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. ఛత్తీస్ఘఢ్కు చెందిన త్రిపాఠి మాదాపూర్లోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. శనివారం తన కారులో స్నేహితులతో కలిసి నాలెడ్జి సిటీకి వెళ్తుండగా అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టాడు. దీంతో త్రిపాఠికి తీవ్రగాయాలు కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్నేహితులు క్షేమంగా బయటపడ్డారు. కేసు నమోదైంది.
Similar News
News September 14, 2025
HYD: విద్యార్థినుల ఫోన్ నంబర్లు వారికెలా వచ్చాయి?

మహిళా వర్సిటీ విద్యార్థినులను వేధిస్తున్న ముగ్గురు యువకులను సుల్తాన్బజార్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ ముగ్గురికీ విద్యార్థినుల ఫోన్ నంబర్లు ఎలా వచ్చాయన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. నిందితుల్లో ఒకరు కార్ డ్రైవర్, మరొకరు హౌస్ కీపింగ్ బాయ్, మరొకరు డెలివరీ బాయ్. అంతమంది నంబర్లను ఎలా సేకరించారనే విషయంపై పోలీసులు దృష్టి సారించారు.
News September 14, 2025
ఖైరతాబాద్: ‘ఈ నెల 24న బీసీ బతుకమ్మ నిర్వహిస్తాం’

ఈ నెల 24న ట్యాంక్ బండ్పై బీసీ బతుకమ్మను ఘనంగా నిర్వహిస్తామని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. వేలాది మంది మహిళలు బీసీ బతుకమ్మ వేడుకలో పాలుపంచుకుంటారన్నారు. ఈ కార్యక్రమానికి అందరూ హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రం ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని కోరారు.
News September 14, 2025
HYD: ఈ ఫార్ములా కేస్.. విజిలెన్స్ కమిషన్ పరిధిలోకి బాల్

గత ప్రభుత్వం HYDలో నిర్వహించిన ఈ ఫార్ములా కార్ రేసులో భారీ అవినీతి జరిగిందని అవినీతి నిరోధక శాఖ పేర్కొంది. ఇందుకు సంబంధించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించి తదుపరి విచారణకు అనుమతివ్వాలని కోరింది. అయితే ప్రభుత్వం ఈ రిపోర్టును విజిలెన్స్ కమిషన్కు పంపి తీసుకోవాల్సిన చర్యలపై అభిప్రాయం కోరింది. విజిలెన్స్ కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ కేసుపై చర్యలు తీసుకోనుంది.