News July 7, 2025

HYD: కాలుకు సర్జరీ.. గుండెపోటుతో బాలుడి మృతి

image

కాలుకు సర్జరీ చేసిన అనంతరం గుండెపోటు రావడంతో 7 ఏళ్ల బాలుడు మృతిచెందిన ఘటన HYDలో వెలుగుచూసింది. కాలులో చీమును తొలగించేందుకు బాలుడిని తల్లిదండ్రులు బంజారాహిల్స్ రోడ్ నంబర్.12లోని టీఎక్స్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. ఈ సమయంలో గుండెపోటు రావడంతో బాలుడు మరణించాడు. వైద్యుల నిర్లక్ష్యంతో తమ కుమారుడి ప్రాణాలు పోయాయని తల్లిదండ్రులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు.

Similar News

News July 7, 2025

వరంగల్: క్వింటా పసుపు రూ.12,659

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు బిల్టీ క్వింటాకి రూ.2,400 పలకగా.. పసుపు రూ. 12,659 ధర పలికింది. అలాగే సూక పల్లికాయకి ధర రూ.6050 రాగా.. పచ్చి పల్లికాయకి రూ.3,850 ధర వచ్చిందని అధికారులు తెలిపారు. మార్కెట్లో కొనుగోలు ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.

News July 7, 2025

జగన్ మానసిక స్థితి బాగాలేదు: మంత్రి సుభాష్

image

AP: వైసీపీ చీఫ్ జగన్ మానసిక స్థితి బాగాలేదని మంత్రి సుభాష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎవరింటికి వెళ్లి ఓదార్చాలో కూడా తెలియడం లేదని ఎద్దేవా చేశారు. ఆయన నేరస్థులకు అండగా ఉంటున్నారని విమర్శించారు. మరోవైపు తాము ప్రజలకు మంచి చేస్తుంటే ప్రతిపక్షం విమర్శిస్తోందని ఫైరయ్యారు. కూటమి పాలనను ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు.

News July 7, 2025

ఏలూరు: పీజీ‌ఆర్‌ఎస్‌కు 55 ఫిర్యాదులు

image

ఏలూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 55 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ తెలిపారు. వీటి స్థితిని తెలుసుకోవాలంటే 1100 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలన్నారు. ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు https://meekosam. ap. gov. in వెబ్‌సైట్ అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. వృద్ధుల వద్దకు ఎస్పీ స్వయంగా వెళ్లి ఫిర్యాదులు స్వీకరించారు.