News February 28, 2025
HYD: కాళోజీ అవార్డు గ్రహీత జయరాజు పదవీ విరమణ

బజార్ ఘాట్లోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ భవన్లో సింగరేణి కార్మికుడు, ప్రముఖ కవి, సినీగేయ రచయిత, కాళోజీ అవార్డు గ్రహీత, తెలంగాణ ఉద్యమకారుడు జయరాజు పదవీ విరమణ జరిగింది. ఈ పదవీ విరమణ సభకు ముఖ్యఅతిథిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొని అభినందనలు తెలిపారు. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు శాలువాతో సన్మానించారు.
Similar News
News February 28, 2025
కారు ఇన్సూరెన్స్లో ఈ 4 యాడ్ ఆన్స్ తప్పనిసరి!

* జీరో డిప్రెసియేషన్: దీనివల్ల ఫుల్ క్లెయిమ్ అందుతుంది.
* ఇంజిన్ ప్రొటెక్షన్: ఇది యాడ్ ఆన్ చేసుకోవడం వల్ల ఇంజిన్ రిపైర్, రీప్లేస్మెంట్ సదుపాయం ఉంటుంది.
* రోడ్ సైడ్ అసిస్టెంట్: ప్రయాణంలో మీ కారు బ్రేక్ డౌన్ అయితే టోయింగ్, ఫ్యూయల్ అందించడం, బ్యాటరీ తదితర రిపైర్స్ చేస్తారు.
* కంన్జ్యూమబుల్ కవరేజీ: రిపేర్ సమయంలో ఇంజిన్ ఆయిల్, నట్లు, బోల్టులు, బ్రేక్ ఆయిల్ వంటి వాటికీ రీయింబర్స్మెంట్.
News February 28, 2025
వనపర్తి: 502 పడకల ఆసుపత్రికి అధిక నిధుల కేటాయింపు

వనపర్తిలో మొత్తం 10 అభివృద్ధి పనులకు మార్చి 2న సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఒక 502 పడకల ఆస్పత్రి భవనం నిర్మాణానికే అత్యధిక నిధులు కేటాయించారు. రూ.721 కోట్ల పనులకు శంకుస్థాపన చేయనుండగా, ఆస్పత్రి భవన నిర్మాణానికే రూ.257 కోట్లు ఖర్చు చేయనున్నారు. వనపర్తి మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఆసుపత్రి భవనం నిర్మిస్తారని అధికారులు చెబుతున్నారు. పేద రోగులకు ఎంతో మెరుగైన వైద్య సౌకర్యం అందుతుందంటున్నారు.
News February 28, 2025
హిందీ నేర్చుకోవడం వల్ల ఉపయోగమేంటి?: కనిమొళి

తమిళులపై కేంద్రం హిందీ భాషను రుద్దడంపై DMK MP కనిమొళి తీవ్రంగా మండిపడ్డారు. అసలు హిందీ నేర్చుకోవడం వల్ల ఉపయోగమేంటని ప్రశ్నించారు. ఆ భాష వల్ల ఏం సాధిస్తామన్నారు. తాను ఎన్నడూ హిందీ నేర్చుకోలేదని, స్కూలుకెళ్లే తన కుమారుడూ ఆ భాషను నేర్చుకోవడం లేదన్నారు. TNలోని ప్రతీ విద్యార్థికి హిందీ రావాలని లేదని తెలిపారు. నూతన విద్యావిధానాన్ని అమలు చేయనందుకు కేంద్రం రూ.5000Cr ఫండ్స్ను నిలిపివేసిందని ఆరోపించారు.