News September 9, 2025

HYD: కీర్తి పురస్కారాలు-2024.. 48 మంది ఎంపిక

image

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఏటా నిర్వహించే కీర్తి పురస్కారాలకు 2024 సంవత్సరానికి గాను 48 మందిని ఎంపిక చేసినట్లు రిజిస్ట్రార్ కోట్ల హనుమంతరావు సోమవారం Way2Newsతో తెలిపారు. VC ఆచార్య వెలుదండ నిత్యానందరావు అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల సంఘం ఆయా రంగాలకు చెందిన ప్రముఖులను పురస్కార గ్రహీతలుగా ఎంపిక చేసిందని, ఈనెల 23, 24న నాంపల్లిలోని ఎన్టీఆర్ కళామందిరంలో ఎంపికైన వారిని సత్కరిస్తామన్నారు.

Similar News

News September 9, 2025

బీజేపీ స్టేట్ కమిటీపై ‘బండి’ గుస్సా

image

నూతనంగా ఏర్పాటైన BJP స్టేట్ కమిటీపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. KNR పార్లమెంట్ పరిధిలో బండి ప్రతిపాదించిన పేర్లను విస్మరించడం ఆగ్రహానికి కారణమని సమాచారం. 2 MLC సీట్లతో పాటు 2 సార్లు MPగా గెలిపించిన KNRకు ప్రాతినిథ్యం లేకపోవడం పట్ల BJP శ్రేణులు ఆందోళనలో ఉన్నాయి. ఇప్పటికే సికింద్రాబాద్ బేస్డ్‌గా స్టేట్ కమిటీ ఏర్పడిందని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

News September 9, 2025

తెలంగాణ భాషకు కాళోజీ కృషి: ADB కలెక్టర్

image

ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని మంగళవారం ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షిషా పాల్గొని కాళోజీ నారాయణరావు చిత్రాటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ భాష సంరక్షణకు కాళోజీ కృషి చేశారని కొనియాడారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు సేవలు మరువలేనివని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీఓ స్రవంతి, జిల్లా అధికారులు ఉన్నారు.

News September 9, 2025

అనకాపల్లి ఎంపీకి డిప్యూటీ స్పీకర్ లేఖ

image

అనకాపల్లి ఎంపీ రైల్వే స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ సీఎం రమేశ్‌కు రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ కె.రఘు రామకృష్ణంరాజు లేఖ రాశారు. చెన్నై-విజయవాడ వందే భారత్ రైలు సర్వీసును భీమవరం మీదుగా నరసాపురం వరకు పొడిగించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. దీనివల్ల ఆ ప్రాంత ప్రజలకు వేగవంతమైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు. దీనిపై ఎంపీ సానుకూలంగా స్పందించారు.