News November 26, 2024
HYD: ‘కేంద్రం సొంత భావాలను అమలు చేస్తుంది’

సమగ్ర కుల గణనతో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని మాజీ పీసీసీ చీఫ్ హనుమంతరావు అన్నారు. మంగళవారం గాంధీభవన్లో మాట్లాడారు. ‘రాజ్యాంగ దినోత్సవం రోజున రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన అవసరం ప్రజలందరిపై ఉంది. కేవలం రాహుల్ గాంధీ కాకుండా ప్రతి ఒక్కరూ రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేయాలి. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం రాజ్యాంగాన్ని అనగదొక్కి తమ సొంత భావాలను అమలు చేస్తుంది’ అని మండిపడ్డారు.
Similar News
News November 6, 2025
హైటెక్స్లో పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్ 2025

HYDలో నవంబర్ 25- 28 వరకు దక్షిణాసియాలోనే అతిపెద్ద పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో జరగనుంది. వన్ నేషన్ వన్ EXPO థీమ్తో జరిగే ఈవెంట్లో 50 దేశాల నుంచి 500 ఎగ్జిబిటర్స్, 40,000 కుపైగా సందర్శకులు పాల్గొంటారు. 35,000 చదరపు మీటర్లలో తాజా పౌల్ట్రీ సాంకేతికతలు, సస్టైనబుల్ సొల్యూషన్స్ ప్రదర్శించబడతాయి. దేశ పౌల్ట్రీ రంగం రూ.1.35 లక్షల కోట్లతో ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తోందని నిర్వాహకులు తెలిపారు.
News November 6, 2025
HYD: గోపి నా పెద్దకొడుకని అక్షరను హత్తుకున్న అవ్వ

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భాగంగా బీఆర్ఎస్ నాయకులు రహమాత్నగర్లోని ఫాతిమా నగర్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇందులో ఓ అవ్వ ‘గోపీ నా పెద్ద కొడుకు అని గుర్తు తలుచుకుంటూ.. నా మనుమరాలు అని ఆప్యాయంగా అక్షరను దగ్గరకు తీసుకొని మనస్ఫూర్తిగా దీవించారు. మాగంటి సునీత అధిక మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గంటెపాక నరేష్, దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు.
News November 6, 2025
HYD: 3 నెలలైనా ఎందుకు పట్టించుకోవడం లేదు: సీఎం

బీఆర్ఎస్ సహకరించకపోతే మోదీ ప్రధాని అయ్యేవారు కాదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ పేరుతో జూబ్లీహిల్స్లో ఓట్లు అడుగుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ కోరితే KCRకు 24 గంటల్లో చిప్పకూడు తినిపిస్తానన్న MP కిషన్ రెడ్డి, విచారణకు ఆదేశించి 3 నెలలైనా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ 30 వేల మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.


