News September 14, 2025

HYD: కొడుకును చంపి మూసీలో పడేశాడు

image

HYDలోని బండ్లగూడ PS పరిధిలో దారుణం జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న తన కొడుకు అనాస్(3)ని తండ్రి మహమ్మద్ అక్బర్ దారుణంగా హత్య చేసి సంచిలో మూట కట్టి మూసీలో పడేశాడు. బాలుడు కనిపించడం లేదని ఏంతెలియనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ప్రవర్తనపై అనుమానంతో విచారించగా.. తానే నేరం చేసినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని మూసీలో బాలుడి మృతదేహం కోసం గాలిస్తున్నారు.

Similar News

News September 14, 2025

గద్వాల్ జిల్లా కోసం చేసిన ధర్నాలు, పోరాటాలు వైరల్

image

నడిగడ్డలోని ప్రజాపాలకులు కలిసి పోరాటం చేయడంతోనే గద్వాల జిల్లా ప్రత్యేక జిల్లాగా అయిందని, ఇందులో BRS పార్టీ చేసింది ఏమీలేదని అప్పటి ఫొటోలు SMలో వైరల్ అవుతున్నాయి. నిన్న తేరు మైదానం సభలో గద్వాల్‌ను జిల్లాగా చేశామని కేటీఆర్‌ చెప్పిన విషయం తెలిసిందే. దీనికి కౌంటర్‌గా గద్వాల్ జిల్లా కోసం చేపట్టిన నిరసనలు, ధర్నాల ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ప్రజాపాలకులు అందరూ కలిసి పోరాటం చేస్తే జిల్లా అవతరించిందన్నారు.

News September 14, 2025

కృష్ణా జిల్లా ఎస్పీ నేపథ్యం ఇదే.!

image

33 ఏళ్ల వయసులోనే 4 జిల్లాల్లో SPగా విధులు నిర్వహించి ప్రజాదరణ పొందిన యువ ఐపీఎస్ వానస విద్యాసాగర్ నాయుడు ప్రతిభతో ఆకట్టుకుంటున్నారు. నరసాపురానికి చెందిన ఆయన కోచింగ్ లేకుండానే సివిల్స్‌లో 101వ ర్యాంకు సాధించి యువతకు ఆదర్శంగా నిలిచారు. “మన ఊరు మన పోలీస్” వంటి వినూత్న కార్యక్రమాలతో క్రైమ్ రేటు తగ్గించి, రాష్ట్రంలో గొప్ప పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు కృష్ణా జిల్లా SPగా ఆయన విధులు నిర్వహించనున్నారు.

News September 14, 2025

యాదాద్రి భక్తుల సౌకర్యార్థం కియోస్క్ యంత్రాలు

image

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆరు కియోస్క్ యంత్రాలను ఈవో వెంకట్రావు ప్రారంభించారు. కెనరా బ్యాంక్ విరాళంగా అందించిన ఈ యంత్రాల ద్వారా భక్తులు క్యూలో నిలబడకుండానే దర్శనం, ప్రసాదాలు, వ్రతాల టికెట్లను డిజిటల్ పద్ధతిలో నేరుగా పొందవచ్చు. ఈ డిజిటల్ సేవలతో భక్తుల సమయం ఆదా అవడంతో పాటు, పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.