News September 22, 2025
HYD: కోహెడ జలపాతంలో పడిపోయిన ఇంటర్ విద్యార్థి

HYD అబ్దుల్లాపూర్మెట్ PS పరిధి కోహెడ జలపాతంలో ఇంటర్ విద్యార్థి గల్లంతయ్యాడు. బేగంపేట రసూల్పూర్కు చెందిన క్యామా సాయితేజ(17), అతడి ఏడుగురు స్నేహితులు సాయిరాం, నందు, మహేశ్, జయంత్, విష్ణు సుర్నార్, కార్తీక్, సునీల్ కలిసి సా.4 గంటల ప్రాంతంలో ORR సర్వీస్ రోడ్డు పక్కనున్న కోహెడ జలపాతం వద్దకెళ్లారు. ఫొటోలు తీస్తుండగా సాయితేజ ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. అగ్నిమాపక సిబ్బంది, DRF బృందం వెతుకుతున్నారు.
Similar News
News September 22, 2025
సెప్టెంబర్ 22: చరిత్రలో ఈరోజు

1936: దర్శకుడు విజయ బాపినీడు జననం
1948: రంగస్థల నటుడు, దర్శకుడు మల్లాది గోపాలకృష్ణ జననం
1952: రచయిత, కళాకారుడు అడివి బాపిరాజు మరణం
1987: సినీ నటుడు ఉన్నిముకుందన్ జననం(ఫొటోలో)
2004: సంగీత దర్శకుడు బి.గోపాలం మరణం
2009: నటి, గాయని ఎస్.వరలక్ష్మి మరణం
➤క్యాన్సర్ రోగుల సంక్షేమ దినం
News September 22, 2025
వరంగల్: భారీ క్యూ లైన్.. ఎందుకో తెలుసా..?

WGL జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో పై ఫొటోలో కనిపిస్తున్న భారీ క్యూ లైన్ ఎందుకో గెస్ చేయండి. ప్రస్తుతం ఎక్కడ చూసినా యూరియా క్యూలైన్లు మనకు కనిపిస్తున్నాయి. అలా, ఇది కూడా యూరియా కోసమే అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. పితృ అమావాస్య సందర్భంగా పెద్దలకు బియ్యం ఇవ్వడం మన సాంప్రదాయం. దీనిలో భాగంగా రాయపర్తి అర్చకుడు ఆరుట్ల రామకృష్ణ చార్యులు ఇంటి ముందు తమ పూర్వీకులకు బియ్యం ఇచ్చేందుకు ఇలా క్యూ కట్టారు.
News September 22, 2025
మహిళలతో కిక్కిరిసిన వేయి స్తంభాల గుడి

సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ పండుగ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మహిళలలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తీరొక్క పూలతో అందంగా అలంకరించి పేర్చిన బతుకమ్మలతో మహిళలందరూ భారీగా వేయి స్తంభాల గుడికి చేరుకొని సందడి చేశారు. చిన్నారులు, మహిళలు బతుకమ్మల చుట్టూ చేరి డీజే పాటలకు అనుగుణంగా పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ పండగ శోభను మరింత పెంచారు. మహిళలతో గుడి ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది.