News September 5, 2025
HYD: గణేశ్ నిమజ్జనం కోసం.. ఆన్ డ్యూటీలో అన్ని శాఖలు!

హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద గణపతి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు మంత్రి ప్రభాకర్ తెలిపారు. పోలీస్, రెవెన్యూ, విద్యుత్, HMDA, వాటర్ బోర్డు, ట్రాఫిక్ పోలీస్, R&B, హైడ్రా, మెడికల్ & హెల్త్, టూరిజం & ఇన్ఫర్మేషన్ విభాగాలు ఆన్ డ్యూటీలో ఉన్నట్లు చెప్పారు. GHMC సెప్టెంబర్ 6న విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు.
Similar News
News September 5, 2025
బాలాపూర్ లడ్డూ కోసం కొత్తగా ఏడుగురు పోటీ

బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలంలో పాల్గొనే కొత్తవారి జాబితాను నిర్వాహకులు విడుదల చేశారు. గత సంవత్సరం కొలన్ శంకర్ రూ.30.01 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. ఈసారి మర్రి రవి కిరణ్ రెడ్డి, సామ ప్రణీత్ రెడ్డి, లింగాల దశరథ్ గౌడ్, కంచర్ల శివరెడ్డి, సామ రామ్ రెడ్డి, PSK గ్రూప్, జిట్టా పద్మా సురేంద్ రెడ్డి లడ్డూ కోసం కొత్తగా పోటీ పడనున్నారు. లాస్ట్ ఇయర్ వరకు లడ్డూ దక్కించుకొన్న వాళ్లు వేలంలో పాల్గొంటారు.
News September 5, 2025
HYD: ఆదివారం ఆలయాలు బంద్

ఈ నెల 7వ తేదీన(ఆదివారం) చంద్ర గ్రహణం ఉంది. ఆ రోజు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయం మధ్యాహ్నం 12 గంటలకు మూసి వేస్తామని ఆలయ కార్యనిర్వహణ అధికారి గుత్తా మనోహర్ రెడ్డి తెలిపారు. తిరిగి సోమవారం ఉదయం 8:30 గంటలకు తెరుస్తామని చెప్పారు. ఇక చిల్కూరు బాలాజీ ఆలయం ఆదివారం సాయంత్రం 4 గంటలకు మూసివేస్తారు. సోమవారం ఉదయం 8 గంటలకు తెరుస్తారు. భక్తులు గమనించాలని ఆలయ సిబ్బంది సూచించారు.
SHARE IT
News September 5, 2025
రేపు నగరం కిటకిట

గణపతి నిమజ్జన ఘట్టం మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతోంది. వేలాది వినాయక విగ్రహాలు వివిధ రూపాల్లో నగర ప్రజలను కనువిందు చేయనున్నాయి. ఈ వేడుకను చూసేందుకు చిన్నా..పెద్దా అందరూ ఎదురుచూస్తున్నారు. నగరవాసులే కాక తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు ప్రజలు కూడా ఇప్పటికే నగరానికి చేరుకున్నారు. దాదాపు 40 లక్షల మంది నిమజ్జన ఘట్టాన్ని తిలకించనున్నారని గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి శశిధర్ తెలిపారు.