News August 25, 2025

HYD: గణేశ్ మండపాలకు ఫ్రీ కరెంట్

image

గణేశ్ మండప నిర్వాహకులకు విద్యుత్ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. వినాయక మండపాలకు ఉచిత విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. నిర్వాహకులు కనెక్షన్ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. గ్రేటర్‌లో గతంలో కమర్షియల్‌ కేటగిరి కింద తాత్కాలిక కనెక్షన్లు జారీ చేసి రూ.1,500 వరకు వసూలు చేసేవారు. ప్రభుత్వం ఈ నెల 27 నుంచి వచ్చేనెల 6 వరకు మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయనుంది.

Similar News

News August 25, 2025

మహానగరంలో రక్తచరిత్ర.. వారంలో 2 దారుణ హత్యలు

image

మహానగరం హత్యలతో ఉలిక్కిపడుతోంది. రక్తపు చారలతో మైల పడుతోంది. వారం రోజుల్లోనే 2 దారుణ హత్యలు జరిగాయి. 18వ తేదీన కూకట్‌పల్లిలో సహస్ర (12)ను 10వ తరగతి విద్యార్థి దారుణంగా కత్తితో పొడిచి హత్య చేయగా.. 23న బోడుప్పల్‌లో మహేందర్‌రెడ్డి తన భార్య స్వాతి(21)ని అత్యంత దారుణంగా చంపి శరీరాన్ని ముక్కలు చేసి మూసీలో పడేశాడు. అత్యంత పాశవికంగా జరిగిన ఈ హత్యలతో మానవత్వం ఏమైపోతోందంటూ పలువురు మండిపడుతున్నారు.

News August 25, 2025

నిర్బంధాల నడుమ ఓయూలో సీఎం పర్యటన: BRSV

image

సీఎం రేవంత్ రెడ్డి నిర్బంధాల నడుమ ఉస్మానియా యూనివర్సిటీని సందర్శిస్తున్నారని బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి శ్రీను నాయక్ మండిపడ్డారు. సీఎం పర్యటన నేపథ్యంలో ముందస్తు అరెస్టులలో భాగంగా ఆయనను అంబర్‌పేట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అధికారం కోసం హామీలు ఇచ్చి నిరుద్యోగులను మోసం చేసి, ఇచ్చిన హామీలను విస్మరించారని ఆరోపించారు.

News August 25, 2025

HYD: 70 మంది పోకిరీల పనిపట్టిన షీ టీమ్స్

image

మహానగరంలో పోకిరీల బెడద నుంచి కాపాడాలని సైబరాబాద్ షీ టీమ్స్‌కు పలువురు ఫోన్ చేసే సహాయం అర్థిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు షీటీమ్స్ సిబ్బంది 143 డెకాయ్ ఆపరేషన్స్ నిర్వహించారు. అసభ్యకరంగా వేధిస్తున్న 70 మందిని పట్టుకున్నట్లు డీసీపీ సృజన కరణం తెలిపారు. అంతేకాక 34 మంది భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు వివరించారు. బాధితులు 181, 1098కు ఫోన్ చేసి చెప్పాలని ఈ సందర్భంగా సూచించారు.