News November 11, 2025
HYD: గృహ ప్రవేశం.. ఓనర్ను ఘోరంగా కొట్టిన హిజ్రాలు

గృహ ప్రవేశం రోజు యజమానిని హిజ్రాలు డబ్బుల కోసం బెదిరించడమే కాకుండా, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన చీర్యాలలోని బాలాజీఎన్క్లేవ్లో జరిగింది. సదానందం నూతన ఇంటికి వచ్చిన హిజ్రాలు రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశారు. యజమాని నిరాకరించగా మరో 15 మందిని వెంట పెట్టుకొచ్చి కుటుంబ సభ్యులను విచక్షణారహితంగా కొట్టారు. ఈ ఘటనలో సదానందం తలకు గాయాలు అయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News November 11, 2025
‘సిద్దిపేట జిల్లాకు అందెశ్రీ జిల్లాగా పేరు మార్చాలి’

సిద్దిపేట జిల్లా పేరును అందెశ్రీ సిద్దిపేట జిల్లాగా పేరు మార్చాలని సీఎం రేవంత్ రెడ్డిని భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర నాయకుడు గాదగోని చక్రధర్ గౌడ్ కోరారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అందెశ్రీని గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు.
News November 11, 2025
జూబ్లీ బైపోల్: 5PM UPDATE.. 47.16% పోలింగ్ నమోదు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా పోలింగ్ మరికాసేపట్లో ముగియనుంది. సాయంత్రం 5 గంటల వరకు నమోదైన ఓటింగ్ శాతాన్ని ఎన్నికల అధికారులు ప్రకటించారు. 47.16% పోలింగ్ నమోదు అయినట్లు స్పష్టం చేశారు. ఆయా పోలింగ్ బూత్లలో ఓటర్లు తమ హక్కును వినియోగించుకుంటున్నారు. మరో అరగంట పోలింగ్కు అవకాశం ఉండడంతో పర్సంటేజ్ ఇంకా పెరగనుంది.
News November 11, 2025
జూబ్లీ బైపోల్: 5PM UPDATE.. 47.16% పోలింగ్ నమోదు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా పోలింగ్ మరికాసేపట్లో ముగియనుంది. సాయంత్రం 5 గంటల వరకు నమోదైన ఓటింగ్ శాతాన్ని ఎన్నికల అధికారులు ప్రకటించారు. 47.16% పోలింగ్ నమోదు అయినట్లు స్పష్టం చేశారు. ఆయా పోలింగ్ బూత్లలో ఓటర్లు తమ హక్కును వినియోగించుకుంటున్నారు. మరో అరగంట పోలింగ్కు అవకాశం ఉండడంతో పర్సంటేజ్ ఇంకా పెరగనుంది.


