News February 24, 2026
HYD ‘గొంతు’పై కత్తి.. సర్కార్కు హైకోర్టు నోటీసులు

నగరవాసుల గొంతు తడిపే హిమాయత్, ఉస్మాన్సాగర్లలో కాలుష్య కారకాలు పెరిగిపోవడంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్& అర్బన్ డెవలప్మెంట్, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శులు, రాష్ట్ర పీసీబీ, GHMC, HMDA కమిషనర్లకు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ మార్చి 26కు వాయిదా వేసింది.
Similar News
News February 24, 2026
HYD: పర్యావరణం పేరుతో పాతాళానికి చెత్త!

జవహర్నగర్, దుండిగల్లో గుట్టుచప్పుడు కాకుండా 25 శాతం మిగులు వ్యర్థాలను అటవీ ప్రాంతాలకు తరలించేందుకు తెరవెనక పావులు కదులుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. వేస్ట్-టు-ఎనర్జీ తర్వాత మిగిలే ప్రమాదకర బూడిదను ఎకో-పార్కుల ముసుగులో భూమిలో పాతిపెట్టేందుకు క్లియరెన్సుల వేట సాగుతోంది. పర్యావరణ అనుమతులు రావడం కష్టమే అయినా, పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని పర్యావరణ వేత్తలు మండిపడుతున్నారు.
News February 24, 2026
మహిళా శక్తికి 20 ఏళ్లు.. భాగ్యనగరంలో YFLO జోష్!

‘ఆడవాళ్లు తలచుకుంటే ఆకాశమే హద్దు’ఇది మాటలు కాదు, 20ఏళ్ల నిలువెత్తు సాక్ష్యం. యువ మహిళా పారిశ్రామికవేత్తల వేదిక(YFLO) తన 20వ వార్షికోత్సవాన్ని బంజారాహిల్స్లో అట్టహాసంగా నిర్వహించింది. ఛైర్పర్సన్ పల్లవి జైన్ నేతృత్వంలో జరిగిన ఈ వేడుకలో స్వాతిలక్రా, మహిమాదాట్ల, స్వప్నాదత్ పాల్గొన్నారు. నాయకత్వం అంటే అధికారం కాదు, బాధ్యతని చెబుతూ.. గత ఛైర్పర్సన్లను సన్మానించి మహిళా సాధికారతే లక్ష్యమని చెబుతున్నారు.
News February 24, 2026
నాగోల్: బజాజ్ ఎలక్ట్రానిక్స్లో ఘరానా మోసం: బాధితుడు

నాగోల్ PS పరిధి అల్కాపురి బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్లో ఘరానా మోసం జరిగిందని వికలాంగుడైన బాధితుడు ఆరోపించారు. కొత్త మొబైల్ పేరిట పాత ఫోన్ అంటగట్టినట్లు ఆయన వాపోయారు. తనకు న్యాయం చేయాలని షోరూమ్ ముందు నిరసనకు దిగగా.. సిబ్బంది బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. వినియోగదారుల హక్కులను కాలరాసే ఇలాంటి వ్యవహారాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని షోరూమ్ ముందు బైఠాయించారు.


