News November 30, 2025
HYD: గ్లోబల్ సమ్మిట్కు రాజమార్గం

డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే గ్లోబల్ సమ్మిట్కు హాజరయ్యే అంతర్జాతీయ ప్రముఖుల కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎర్పాట్లు చేస్తోంది. రూ.69.23లక్షల అంచనా వ్యయంతో శ్రీశైలం హైవే నుంచి RGIA ఎంట్రీ గేట్ వరకు ఉన్న రోడ్డును ముస్తాబు చేస్తున్నారు. ఇందుకోసం బీటీ రోడ్డుపై బీసీ ఓవర్లేయింగ్ పనులు చేపట్టాలని ఎన్ఏసీ నిర్ణయించింది. ఈ మార్గంలోనే అతిథులను కందుకూరులోని సమ్మిట్ వేదికకు వెళ్లనున్నారు.
Similar News
News December 1, 2025
కరీంనగర్: ప్రచారంలో అభ్యర్థుల పాట్లు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సర్పంచ్, వార్డు సభ్యులకు పోటీ చేయుచున్న అభ్యర్థులు వారి గెలుపు కోసం పాట్లు పడుతున్నారు. ఉదయం నుంచి గ్రామంలో తిరుగుతూ ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరినీ చాయ్ తాగినావా? తిన్నవా? మంచిదేనా? ఎటు పోతున్నావ్ అంటూ తదితర ముచ్చట్లు పెడుతూ చివరకు తాను గ్రామపంచాయతీ ఎన్నికలలో సర్పంచ్కు లేదా వార్డు సభ్యుడిగా పోటీ చేస్తున్నానని, జర నాకు ఓటు వేసి గెలిపించండని ప్రాధేయపడుతున్నారు.
News December 1, 2025
CSIR-IHBTలో ఉద్యోగాలు

CSIR-ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయోస్పియర్ టెక్నాలజీ(IHBT) 9 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల వారు DEC 29 వరకు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BSc( అగ్రికల్చర్/హార్టికల్చర్/ఫారెస్ట్రీ/ బయాలజీ/ కెమికల్ సైన్స్/ అనలైటికల్ కెమిస్ట్రీ/కెమికల్ ఇంజినీరింగ్/ బయో కెమికల్ ), టెన్త్+ITI/ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అర్హులు. రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
News December 1, 2025
AP న్యూస్ రౌండప్

* విజయవాడ తూర్పు నియోజకవర్గం రామలింగేశ్వర నగర్లో రిటైనింగ్ వాల్కు శంకుస్థాపన చేసిన హోం మంత్రి అనిత
* తిరుపతి కేంద్రంగా రాయలసీమ జోన్ను టూరిజం, ఇండస్ట్రీస్తో అభివృద్ధి చేస్తామన్న మంత్రి అనగాని సత్యప్రసాద్
* పండగ సీజన్ వస్తోంది.. ప్రైవేటు ఆలయాల్లో రద్దీపై ప్రత్యేక దృష్టి పెట్టండి: CS విజయానంద్
* వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఛిన్నాభిన్నం చేసింది: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి


