News August 15, 2025
HYD: జాతీయ జెండా ఆవిష్కరించిన మేయర్ విజయలక్ష్మి

ఖైరతాబాద్ GHMC ప్రధాన కార్యాలయం వద్ద స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్ కర్ణన్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మేయర్ విజయలక్ష్మి జాతీయ జెండాను ఆవిష్కరించారు. మేయర్ మాట్లాడుతూ.. మన అందరి నినాదం జాతీయత అయి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఉద్యోగులు పాల్గొన్నారు.
Similar News
News August 15, 2025
బుమ్రాను ముఖ్యమైన మ్యాచుల్లోనే ఆడించాలి: భువనేశ్వర్

వర్క్లోడ్ విషయంలో బుమ్రాకు భువనేశ్వర్ మద్దతుగా నిలిచారు. ENGతో 5 టెస్టుల సిరీస్లో బుమ్రా మూడింట్లో మాత్రమే ఆడటంతో అతని పట్ల BCCI పక్షపాతం చూపిస్తోందన్న విమర్శలొచ్చాయి. దీనిపై భువి స్పందిస్తూ ‘ఏళ్ల పాటు అన్ని ఫార్మాట్లలో ఆడుతూ ఫిట్గా ఉండటం కష్టం. అతడు ఏం చేయగలడో సెలక్టర్లకు తెలుసు. బుమ్రా ఎక్కువ కాలం ఆడాలని కోరుకుంటే అతడిని IMP మ్యాచుల్లోనే ఆడించాలి’ అని అభిప్రాయపడ్డారు.
News August 15, 2025
‘ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వ పాలన’

ఖమ్మం: ప్రజల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని Dy.CM భట్టి విక్రమార్క అన్నారు. జిల్లాలో నూతనంగా 24 వేల 818 కుటుంబాలకు రేషన్ కార్డ్లు జారీ చేశామని చెప్పారు. 3,37,898 మంది రైతుల ఖాతాలో రూ. 427 కోట్ల 38 లక్షల రైతు భరోసా నిధులు జమ చేసామని తెలిపారు. అలాగే జిల్లాలో 16 వేల 153 మంది లబ్దిదారులకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిందని పేర్కొన్నారు.
News August 15, 2025
‘రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధిలో దూసుకెళ్తుంది’

భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఘా జాతీయ జెండాను ఎగురవేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకెళుతుందన్నారు. జిల్లా ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.