News February 25, 2025

HYD: జూ పార్క్‌లో టికెట్ ధరలు పెంపు

image

HYD బహదూర్‌పురాలోని నెహ్రూ జూలాజికల్ పార్క్ ఎంట్రీ టికెట్ ధర పెంచినట్లు క్యూరేటర్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. చిన్నారులకు రూ. 50, పెద్దలకు రూ. 100 చొప్పున టికెట్ ధరలు నిర్ణయించారు. పార్క్ లోపల సఫారీ, ట్రెయిన్ రైడ్, ఫిష్ ఆక్వేరియం వెళ్లే ధరలు కూడా పెరిగాయి. మార్చి 1వ తేదీ నుంచి ఇవి అమల్లోకి వస్తాయని క్యూరేటర్ స్పష్టం చేశారు.

Similar News

News February 25, 2025

రెడ్డిలపై చేసిన వ్యాఖ్యలను తప్పుగా తీసుకోవద్దు: జగ్గారెడ్డి

image

ఇటీవల కాంగ్రెస్ పార్టీలోని కొందరు రెడ్డి సామాజిక వర్గంపై చేసిన విమర్శల్ని తప్పుగా తీసుకోవద్దని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఇటీవల పార్టీలోకి వచ్చిన కొందరు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. వాళ్ల మాటలు పట్టించుకోని పార్టీ పట్ల వ్యతిరేక భావన కలిగి ఉండవద్దన్నారు. రెడ్డి సామాజిక వర్గం ప్రస్తుతం రాష్ట్రంలో నాయకత్వం స్థానంలో ఉందని అందరూ ఓపిగ్గా ఉండాలని కోరారు.

News February 25, 2025

ప్రశాంత్ ‘బ్రహ్మరాక్షస్’ మూవీలో ప్రభాస్?

image

హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నారని సమాచారం. త్వరలోనే లుక్ టెస్టులోనూ పాల్గొంటారని టాలీవుడ్ టాక్. బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌తో ప్రశాంత్ తీయాలనుకున్న ‘బ్రహ్మ రాక్షస్’ మూవీ మధ్యలో ఆగిపోయిన విషయం తెలిసిందే. అదే మైథలాజికల్ స్టోరీని డార్లింగ్ బాడీ లాంగ్వేజ్‌కు అనుగుణంగా మార్చుతున్నట్లు తెలుస్తోంది.

News February 25, 2025

పెళ్లి చేసుకోండి.. లేదంటే ఉద్యోగం తీసేస్తాం: కంపెనీ వార్నింగ్

image

బాగా పనిచేయకపోతే ఉద్యోగం ఊస్టింగే అని కంపెనీలు వార్నింగ్ ఇవ్వడం సహజం. అయితే చైనాలో ‘షాన్‌డాంగ్’ అనే సంస్థ తమ ఒంటరి సిబ్బందిని SEP నాటికి పెళ్లి చేసుకోవాలని ఆదేశించింది. లేదంటే జాబ్ వదులుకోవాల్సిందేనని హెచ్చరించింది. దీనిపై GOVT అధికారులు మందలించినా కంపెనీ తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. దేశంలో వివాహ రేటును పెంచడానికే ఇలా చేశామంది. కాగా చైనాలో వివాహ, జనన రేటు భారీగా పడిపోయిన విషయం తెలిసిందే.

error: Content is protected !!