News February 25, 2025
HYD: జేసీపీగా బాధ్యతలు స్వీకరించిన జోయల్

HYD నగర ట్రాఫిక్ విభాగం సంయుక్త పోలీస్ కమిషనర్గా జోయల్ డేవిస్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు సైబరాబాద్ ట్రాఫిక్ చీఫ్గా పనిచేశారు. ఆయన కొన్నేళ్లుగా నగర ట్రాఫిక్కు ఐజీ ర్యాంకులో ఉండే అధికారిగా అదనపు సీపీ హోదాలో బాధ్యతలు వహిస్తుండగా.. ప్రస్తుతం డీఐజీ ర్యాంకులో ఉండటంతో ఆయనను సంయుక్త పోలీస్ కమిషనర్గా నియమించారు.
Similar News
News February 25, 2025
ప్రభుత్వ ఉద్యోగులకు మస్క్ వార్నింగ్.. ట్రంప్ మద్దతు

అమెరికాలోని ప్రభుత్వ ఉద్యోగులకు డోజ్ చీఫ్ మస్క్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. గత వారం చేసిన పనులను రెండు రోజుల్లో చెప్పాలని, లేకపోతే రిజైన్ చేయాలని ఎక్స్లో పోస్టు పెట్టగా దాన్ని పట్టించుకోవద్దని ట్రంప్ యంత్రాంగం భరోసానిచ్చింది. అయితే మస్క్ వ్యాఖ్యలకు అధ్యక్షుడు ట్రంప్ మద్దతిచ్చారు. ఉద్యోగులు చేస్తున్న పని గురించి మస్క్ ప్రశ్నిస్తున్నారని, దానికి సమాధానం ఇవ్వాలని వారికి సూచించారు.
News February 25, 2025
కామారెడ్డి: గురుకుల ప్రవేశ పరీక్షకు 97.34% హాజరు

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో నిర్వహించిన ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని గురుకులాల ఉమ్మడి ప్రవేశ పరీక్షల నోడల్ అధికారి G.నాగేశ్వరరావు తెలిపారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 16 సెంటర్లు ఏర్పాటు చేయగా 97.34% శాతం హాజరు నమోదైందన్నారు. పరీక్షల్లో 7481 మంది విద్యార్థులకు గానూ 7282 మంది వచ్చారని పేర్కొన్నారు.
News February 25, 2025
ఏనుగుల దాడి.. మృతులకు రూ.10 లక్షల పరిహారం

AP: అన్నమయ్య జిల్లాలో భక్తులపై <<15571904>>ఏనుగుల దాడి<<>> ఘటనలో మృతుల కుటుంబాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిహారం ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అనౌన్స్ చేశారు. క్షతగాత్రుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఇస్తామని పేర్కొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.