News August 23, 2025
HYD: ట్రాన్స్జెండర్ ఐడీ కార్డుల కోసం ప్రత్యేక శిబిరం

తెలంగాణలోని ట్రాన్స్జెండర్లకు ఐడీ కార్డులు, ఆధార్ కార్డుల సవరణలకు ఒక ప్రత్యేక శిబిరం ఆగస్టు 26న హైదరాబాద్లోని దివ్యాంగులు, వయో వృద్ధులు, ట్రాన్స్జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఈ శిబిరం ఉదయం 10:30 నుంచి సా.5:30 గంటల వరకు ఉంటుందని ఆ శాఖ డైరెక్టర్ బి.శైలజ ఈరోజు తెలిపారు. ఈ అవకాశాన్ని ట్రాన్స్జెండర్లు వినియోగించుకోవాలని కోరారు.
Similar News
News August 24, 2025
HYD: ఈ ఆర్టీసీ బస్సుల్లో జర్నీ చేస్తే ఛార్జీల్లో డిస్కౌంట్

పలు రకాల బస్సుల్లో ప్రయాణానికి డిస్కౌంట్లు ప్రకటిస్తున్నట్లు ఆర్టీసీ తెలిపింది. HYD నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే లహరి NON-AC, సూపర్ లగ్జరీ బస్సుల్లో 15%, లహరి AC, రాజధాని AC బస్సుల్లో ప్రయాణ ఛార్జీల్లో 10 శాతం డిస్కౌంట్ ప్రకటిస్తున్నట్లు తెలిపింది. HYD నుంచి కడప, ఒంగోలు, కందుకూరు, నెల్లూరు, తిరుపతి, గుంటూరు, విజయనగరం, రాజమండ్రి, కాకినాడ, సహా అనేక ప్రాంతాలకు వెళ్లే బస్సులకు వర్తిస్తుందన్నారు.
News August 24, 2025
HYD: ఐరన్ పైపు తలపై పడి యువకుడి మృతి

HYD సూరారం PS పరిధిలో 4వ అంతస్తు నుంచి ఐరన్ పైపు తలపై పడి అరవింద్ అనే వ్యక్తి చనిపోయాడని పోలీసులు తెలిపారు. అరవింద్ బిల్డింగ్ సూపర్వైజర్గా పనిచేస్తూ మల్లారెడ్డి ఆసుపత్రి ప్రాంగణంలో కొత్తగా నిర్మిస్తున్న హాస్టల్ భవన పనులు పర్యవేస్తుండగా ఐరన్ పైప్ ఒక్కసారిగా పడిందన్నారు. తీవ్రగాయాలైన అతడిని మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మరణించాడని చెప్పారు. ఈరోజు కేసు నమోదు చేశామన్నారు.
News August 24, 2025
HYD: ‘మన ఊరు-మన బడి’ కాంట్రాక్టర్లపై కేసు నమోదు

సీఎం రేవంత్ రెడ్డి ఛాంబర్ దగ్గరికి వెళ్లిన ‘మన ఊరు-మన బడి’ కాంట్రాక్టర్లపై కేసు నమోదైంది. సైఫాబాద్ పీఎస్లో సీఐ ఫిర్యాదుతో 11 మంది కాంట్రాక్టర్లపై కేసులు నమోదయ్యాయి. ఇది కాంట్రాక్టర్లను భయపెట్టే, గొంతు నొక్కే కుట్ర మాత్రమే అని కాంట్రాక్టర్లు చెప్పారు. మమ్మల్ని కేసులతో బెదిరిస్తే వెనక్కి తగ్గమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాంట్రాక్టర్లపై పెట్టిన తప్పుడు కేసును వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు.