News October 25, 2025
HYD: డీఐ ఛేజింగ్.. ఎట్టకేలకు అతడు చిక్కాడు..!

HYD దుండిగల్ PS పరిధిలో ఖయ్యూం అనే వ్యక్తి ఒకరిని మోసం చేసి రూ.25 లక్షలను కాజేశాడు. కేసు దర్యాప్తులో భాగంగా శుక్రవారం రాత్రి మేడ్చల్ రైల్వే స్టేషన్లో ఖయ్యూం ఉన్నట్లు వచ్చిన సమాచారంతో డీఐ కిరణ్ సిబ్బందితో కలిసి వెళ్లాడు. పోలీసులను చూడగానే ఖయ్యూం రైలు పట్టాల మీదుగా పరిగెత్త సాగాడు. డీఐ కిరణ్, సిబ్బంది కలిసి అతడి వెంట పరిగెత్తి సినిమా స్టైల్లో ఛేజింగ్ చేసి పట్టుకున్నారు.
Similar News
News October 25, 2025
ప్రతీ ఆలయాన్ని దీపాలతో అలకరించాలి: మంత్రి కొండా

కార్తీక దీపోత్సవాన్ని కనుల పండగలా నిర్వహించాలని, రాష్ట్రంలోని ప్రతి దేవాలయం దీపాలతో అలంకరించాలని మంత్రి కొండా సురేఖ అన్నారు. కార్తీక దీపోత్సవం 22.10.2025 నుంచి 19.11.2025 వరకు నిర్వహించనున్న నేపథ్యంలో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా ఆలయాలకు విచ్చేసే భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.
News October 25, 2025
సురక్షా యాప్ను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

భీమవరం కలెక్టరేట్ వద్ద కలెక్టర్ చదలవాడ నాగరాణి సురక్షా యాప్ వినియోగం, ప్లాస్టిక్ నిషేధం, గంజాయి, మత్తు పదార్థాల తనిఖీలు, ఎక్సైజ్ శాఖ ప్రగతి తదితర అంశాలపై ఎక్సైజ్ అధికారులతో సమీక్షించారు. కల్తీ అక్రమ మద్యాన్ని పూర్తిగా నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారులకు సురక్షా యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. వినియోగదారులు ఈ యాప్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News October 25, 2025
చిత్తూరు: సోలార్ ప్లాంట్ల టెండర్లకు ఆమోదం..!

జిల్లాలో <<18100873>>సోలార్ ప్లాంట్ల<<>> టెండర్లు ఖరారయ్యాయి. SPDCL SE ఇస్మాయిల్ అహ్మద్ పర్యవేక్షణలో కుప్పం, చిత్తూరు డివిజన్లో ప్లాంట్ పనులు 2026 MAR. ఆఖరుకల్లా పూర్తవుతాయని అధికారులు తెలిపారు. ఈ ప్లాంట్ల ఏర్పాటుతో రైతులకు పగలే నిరంతరాయంగా 9 గం. విద్యుత్ సరఫరా అందనుంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక యూనిట్ విద్యుత్ కొనుగోలుకు రూ.6.50 ఖర్చు కానుండగా సోలార్ విద్యుత్తో ఆ ధర రూ.3.20కు దిగి రానుంది.


