News September 22, 2025
HYD: తల్లిదండ్రుల హత్య కేసులో నిందితుడికి రిమాండ్

మల్కాజిగిరిలోని <<17789520>>నేరేడ్మెట్ పోలీస్స్టేషన్<<>> పరిధి సాయినగర్లో నివసించే రాజయ్య, లక్ష్మీ దంపతుల కుమారుడు శ్రీనివాస్ ఆదివారం మద్యం మత్తులో తల్లిదండ్రులతో గొడవ పడి, వారిని చంపిన విషయం తెలిసిందే. స్థానికులు శ్రీనివాస్ను చితకబాది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. సోమవారం అతడిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం అతడికి రిమాండ్ విధించింది.
Similar News
News September 23, 2025
ఈ గవర్నెన్స్ సదస్సులో ఉత్తమ పంచాయతీలకు అవార్డ్స్

విశాఖలో నిర్వహించిన ఈ-గవర్నెన్స్ సదస్సులో ఉత్తమ పంచాయతీలకు కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ అవార్డులను అందజేశారు.
గోల్డ్ అవార్డు : రోహిణి పంచాయితీ, Dhule జిల్లా, మహారాష్ట్ర
సిల్వర్ అవార్డు : West Majlishpur పంచాయతీ, వెస్ట్ త్రిపుర, త్రిపుర
జ్యారీ అవార్డు: 1.Suakati పంచాయతీ, Kendujhar జిల్లా, ఒరిస్సా
2.Palsana పంచాయితీ, సూరత్ జిల్లా, గుజరాత్
సర్పంచులు అవార్డులను స్వీకరించారు.
News September 23, 2025
HEADLINES

*యూరియాతో ఆరోగ్యానికి తీవ్ర నష్టం: సీఎం చంద్రబాబు
*TG: సమ్మక్కసాగర్ ప్రాజెక్టుకు లైన్ క్లియర్
*స్వదేశీ వస్తువులనే కొనండి: ప్రజలకు PM లేఖ
*TG: సింగరేణి కార్మికులకు రూ.1,95,610 చొప్పున బోనస్
*మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దుర్మార్గం: బొత్స
*ENCOUNTER: మావోయిస్టు నేతలు రామచంద్రారెడ్డి, సత్యనారాయణ రెడ్డి హతం
News September 23, 2025
రిజర్వేషన్ల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం రిజర్వేషన్ల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం ఆసిఫాబాద్ కలెక్టరేట్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్ల ప్రక్రియపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు పాల్గొన్నారు. రిజర్వేషన్ల విధివిధానాలపై వారికి కలెక్టర్ దిశానిర్దేశం చేశారు