News January 31, 2025
HYD: తల్లి మృతి.. 9 రోజులు ఇంట్లోనే మృతదేహం

వారాసిగూడలో విషాద ఘటన వెలుగుచూసింది. తల్లి మృతి చెందడంతో డిప్రెషన్లోకి వెళ్లిన కూతుళ్లు 9 రోజులుగా ఇంట్లోనే ఉండిపోయారు. దుర్వాసన రావడంతో స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా ఈ విషయం వెలుగుచూసింది. MLA పద్మారావు చొరవతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని గాంధీకి తరలించారు. మృతురాలు శ్రీ లలిత (45) అని పేర్కొన్నారు. తల్లిని కోల్పోయిన రవళిక (25), అశ్విత (22) కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
Similar News
News February 10, 2026
HYD: మూసీ తీరాన ‘దోమల’ ఘోష!

మూసీ ప్రక్షాళన సంగతేమో కానీ.. దోమల సంతతి మాత్రం రికార్డు స్థాయిలో పెరుగుతోంది. 2024లో మూసీ పరీవాహక ప్రాంతాల్లో 450 మలేరియా కేసులు నమోదవ్వగా 2025 ముగిసేసరికి ఆ సంఖ్య 700 దాటేసింది. అధికారులు డ్రోన్లతో మందులు చల్లుతున్నామని చెబుతున్నా గుర్రపుడెక్క ముందు అవేవీ పనిచేయడం లేదు. సాయంత్రం 6 దాటిందంటే చాలు కిటికీలు తెరిస్తే ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే. ఏటా రూ.కోట్లు ఖర్చు పెడుతున్నా దోమలు తగ్గడం లేదు.
News February 10, 2026
HYD: కొత్త కమిషనరేట్లు.. వీరే బాధ్యులు..!

* కమిషనర్ కర్ణన్ టీంలో అనురాగ్ జయంతి, ప్రియాంక ZCలుగా అందుబాటులో ఉంటారు. మీ ఏరియాలో ఎలాంటి సమస్యలున్నా 7993425555కు కాంటాక్ట్ అవ్వొచ్చు.
* వినయ్ కృష్ణారెడ్డి టీంలో ZCలుగా సాంచిత్ గంగ్వార్, రాధికా గుప్తా వ్యవహరిస్తారు. మీ ఏరియాలో ఎలాంటి సమస్యలున్నా 9063421145కు కాల్ చేయొచ్చు.
* సృజన టీంలో భోకాడే హేమంత్, అపూర్వ్ చౌహాన్, సందీప్ కుమార్ ZCలుగా ఉంటారు. ఎలాంటి సమస్యలున్నా 8008011110కు కాంటాక్ట్ కావచ్చు.
News February 10, 2026
HYD: నయా కమిషనరేట్లు.. వీరి చేతుల్లో ఈ జోన్లు!

* కర్ణన్-LBనగర్, శంషాబాద్, రాజేంద్రనగర్, చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్ల పరిధి ఈయనదే.
* వినయ్ కృష్ణారెడ్డి-మల్కాజిగిరి, ఉప్పల్ జోన్లలోని కీసర, అల్వాల్, బోయిన్పల్లి, మౌలాలి, మల్కాజిగిరి, ఘట్కేసర్, కాప్రా, నాచారం, ఉప్పల్, బోడుప్పల్ బాధ్యతలు ఈయనకే.
* సృజన-శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ జోన్లలోని గచ్చిబౌలి, మాదాపూర్, నిజాంపేట్, జీడిమెట్ల సహా 16సర్కిళ్ల బాధ్యత ఈమెదే.


