News September 11, 2025
HYD: తెలుగు వర్శిటీలో స్పాట్ అడ్మిషన్లు

ఈ ఏడాదికి PG చేరడానికి సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ డైరెక్టర్ డా.బి.రాధ Way2Newsతో తెలిపారు. SEP 19, 20న ఉ. 11 గంటల నుంచి సా. 4.30 వరకు బాచుపల్లిలో దరఖాస్తులకు అవకాశం ఉంది. ఆసక్తి గల విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, 3 ఫొటోలు, 3 సెట్ జిరాక్స్ పత్రాలతో హాజరుకావాలని చెప్పారు. ప్రవేశ పరీక్ష రాయని వారు రూ.600/- DD సమర్పించాలని సూచించారు.
Similar News
News September 11, 2025
సేంద్రియ వ్యవసాయంపై దృష్టి పెట్టాలి: కలెక్టర్

అంబేడ్కర్ కోనసీమ రైతాంగం ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద వ్యవసాయ మిషన్ అమలుపై అనుబంధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన పెంచుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
News September 11, 2025
అమలాపురం పోలీసులకు తప్పిన ప్రమాదం

సీఎం చంద్రబాబు పర్యటనకు అనంతపురం వెళ్లిన అమలాపురం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ కుమార్, ఉప్పలగుప్తం సబ్ ఇన్స్పెక్టర్ రాజేశ్లకు పెను ప్రమాదం తప్పింది. నెల్లూరు జిల్లా దుత్తలూరు వద్ద వీరి కారును ఓ మినీ లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. ఇద్దరు పోలీసులు స్వల్ప గాయాలతో బయటపడటంతో అధికారులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
News September 11, 2025
NZB: కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తే క్రిమినల్ కేసులు

నిజామాబాద్ సమీకృత కలెక్టరేట్ ఎదుట ధర్నా, రాస్తారోకో, ఎటువంటి నిరసన కార్యక్రమాలు చేయడానికి వీలులేదని రూరల్ ఎస్సై ఆరిఫ్ తెలిపారు. ఎటువంటి నిరసన కార్యక్రమాలు ఉన్న నిజామాబాద్ ఏసీపీ అనుమతితో ధర్నాచౌక్, ఓల్డ్ కలెక్టరేట్ ప్రాంతంలో చేసుకోవాలన్నారు. ఎవరైనా IDOC ఎదుట నిరసన కార్యక్రమాలు జరిపితే వారిపై క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.