News October 22, 2025
HYD: తెలుగు వర్శిటీ.. క్రికెట్ జట్టు కెప్టెన్లు వీరే!

సూరవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్శిటీలో క్రికెట్ టోర్నీ బుధవారం నిర్వహిస్తున్నట్లు వర్శిటీ స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ ఆర్.గోపాల్ Way2Newsతో తెలిపారు. జట్టు సారథులను ఎంపిక చేశామన్నారు.1.TU డెవిల్స్ జట్టు కెప్టెన్గా అమీర్ 2.TU సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్గా ముస్తాక్ 3.TU ఛాలెంజర్స్ జట్టు కెప్టెన్గా వినోద్ 4.TU వారియర్స్ జట్టు కెప్టెన్గా ప్రవీణ్ 5.TU ది డామినేటర్స్ జట్టు కెప్టెన్గా అరుణ్
Similar News
News October 22, 2025
WWC: పాక్ ఔట్.. భారత్లోనే సెమీస్, ఫైనల్

నిన్న సౌతాఫ్రికా చేతిలో ఓటమితో ఉమెన్స్ వరల్డ్ కప్ నుంచి పాక్ క్రికెట్ జట్టు నిష్క్రమించిన విషయం తెలిసిందే. దీంతో సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్లు భారత్లోనే జరగనున్నాయి. పాక్ సెమీస్/ఫైనల్కు వెళ్తే ఆ మ్యాచ్లు శ్రీలంకలో నిర్వహించాలన్న ఉద్దేశంతో ICC ఇంకా వేదికలను ఖరారు చేయలేదు. ఇప్పుడు పాక్ ఇంటికెళ్లడంతో ఈనెల 29, 30 తేదీల్లో సెమీఫైనల్స్, NOV 2న ఫైనల్ INDలోనే నిర్వహించనుంది.
News October 22, 2025
ప్రారంభమైన ఎనుమాముల మార్కెట్.. పత్తి ధర ఎంతంటే?

నాలుగు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ బుధవారం ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్లో గత వారంతో పోలిస్తే పెరిగింది. గత వారం క్వింటా పత్తి ధర రూ.6,930 పలకగా.. నేడు రూ.7,000 మార్క్ దాటి 7,010 అయ్యింది. నిన్న అర్ధరాత్రి కురిసిన వర్షానికి మార్కెట్ ఆవరణలో కొంచెం బురదమైనప్పటికీ, ఉదయం నుంచి క్రయవిక్రయాలు కొనసాగుతున్నాయి.
News October 22, 2025
నేడు బలి చక్రవర్తి భూమ్మీదకు వస్తాడట

నేటి నుంచి కార్తీక మాసం మొదలవుతుంది. ఈ నెలలో వచ్చే తొలి తిథిని బలి పాడ్యమి అంటారు. ఈ శుభదినాన బలి చక్రవర్తి భూలోకాన్ని చూడ్డానికి భూమ్మీదకు వస్తాడని పురాణాలు చెబుతున్నాయి. విష్ణువు వామనావతారంలో బలి చక్రవర్తిని పాతాళానికి పంపినప్పుడు ప్రతి ఏడాది 3 రోజులు భూలోకాన్ని పాలించే వరం ఇస్తాడు. ఆ 3 రోజుల్లో ఇదొకటి. నేడు దాన గుణుడైన బలిని స్మరిస్తూ, భక్తులు తమ ఇళ్లను దీపాలతో అలంకరించి, దానధర్మాలు చేస్తారు.