News March 27, 2026
HYD: త్వరలో తీన్మార్ మల్లన్న పాదయాత్ర

అసెంబ్లీ చీట్ చాట్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కీలక వ్యాఖ్యలు చేశారు. అగ్రవర్ణాలతో కలిసేది లేదని, బీసీల హక్కుల కోసం బరిలోకి దిగుతామన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జూన్ 2 నుంచి పాదయాత్ర చేపడతామని, హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర ఉమ్మడి మహబూబ్నగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాలో కొనసాగి… చివరలో వరంగల్లో భారీ బహిరంగ సభతో ముగుస్తుందన్నారు.
Similar News
News April 1, 2026
WGL: ఫీజు రీయింబర్స్మెంట్కు దరఖాస్తుల ఆహ్వానం

2025– 26 విద్యాసంవత్సరానికి వరంగల్ జిల్లాలోని కళాశాలల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, వికలాంగుల ఫ్రెష్, రెన్యువల్ విద్యార్థులు పోస్టుమెట్రిక్, ప్రీమేట్రిక్ ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమాధికారి పీ.భాగ్యలక్ష్మి తెలిపారు. అభ్యర్థులు ఈనెల 20లోపు అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలని ఆమె సూచించారు.
News April 1, 2026
₹50 నుంచి ₹కోట్ల రెమ్యునరేషన్ అందుకునే స్థాయికి..!

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తొలినాళ్లలో రెమ్యునరేషన్ గురించి తోటి నటుడు శ్రీనివాసన్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 1980లో ‘విలక్కనుండు స్వప్నంగళ్’ అనే సినిమాలో చేసిన పాత్రకు మమ్ముట్టికి ఇచ్చింది 50 రూపాయలేనని తెలిపారు. అందులో గుర్తింపు రావడంతో ఆ తర్వాత సినిమా ‘మేళా’కు ₹800 అందుకున్నారని చెప్పారు. ఆ ₹800లకే మమ్ముట్టి ఎంతో సంతోషపడ్డారని అన్నారు. కాగా ప్రస్తుతం మమ్ముట్టి ₹10-20Cr అందుకుంటున్నారు.
News April 1, 2026
వరంగల్: నేటి నుంచే 10TH పేపర్ల మూల్యాంకనం

పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం నేటి నుంచి కాజీపేటలోని ఫాతిమా హై స్కూల్లో ప్రారంభం కానుంది. ఏప్రిల్ 23 వరకు కొనసాగనున్న ఈ ప్రక్రియలో సుమారు 2.40 లక్షల పేపర్లను మూడు విడతల్లో దిద్దనున్నారు. ఏప్రిల్ 1– 9 వరకు భాషలు, గణితం, 10– 17 వరకు సైన్స్, 18– 23 వరకు సాంఘికం, వొకేషనల్ పేపర్లు మూల్యాంకనం చేయనున్నారు. ఏర్పాట్లను డీఈవో ఎల్వీ గిరిరాజ్ గౌడ్ పరిశీలించారు.


