News August 25, 2025

HYD: త్వరలో సీఎంల కీలక సమావేశం?

image

తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి త్వరలో భేటీ కానున్నారు. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేకు సంబంధించి ఇద్దరు మాట్లాడనున్నట్లు సమాచారం. రోడ్ అలైన్‌మెంట్, ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల విషయాలు చర్చించనున్నారు. వీరి చర్చలు ఓకే అయితే.. ఆ నివేదికను కేంద్రానికి పంపి అనుమతి కోరనున్నట్లు తెలిసింది.

Similar News

News August 25, 2025

హైదరాబాదు నుంచి సరికొత్త టూర్ ప్లాన్స్

image

HYD నుంచి టూర్ వెళ్లాలనుకునే వారికి తెలంగాణ టూరిజం శాఖ కొత్త ప్యాకేజీలు అందుబాటులోకి తెచ్చింది. నగరం నుంచి అరుణాచలం, బెంగళూరు, అన్నవరం ప్రాంతాలకు వెళ్లడానికి వేర్వేరుగా బస్సులను నడుపుతోంది. బెంగళూరు టూర్ 2 రోజులు, అరుణాచలం టూర్ 3 రోజులు, అన్నవరం ట్రిప్ 4 రోజులు ఉండనుంది. పూర్తి వివరాలకు 98485 40371,98481 25947, 98480 07020 నంబర్లకు కాల్ చేయవచ్చని అధికారులు తెలిపారు.

News August 25, 2025

గణేశ్ నిమజ్జనానికి GHMC భారీ ఏర్పాట్లు

image

హుస్సేన్‌సాగర్‌తో సహా HYDలోని 66 చెరువులు, కుంటల్లో GHMC నిమజ్జనానికి ఏర్పాట్లు చేసింది. 41 కృత్రిమ పాయింట్లను ఏర్పాటు చేసింది. 3.10 లక్షల మట్టి గణేశ్ విగ్రహాలు పంపిణీ చేయనుంది. నిమజ్జనానికి 140 స్టాటిక్, 295 మొబైల్ క్రేన్లు సిద్ధం చేశారు. 160 గణేశ్ యాక్షన్ టీమ్‌లు, 14,486 పారిశుద్ధ్య కార్మికులు రంగంలోకి దిగనున్నారు. 13 కంట్రోల్ రూములు, 309 మొబైల్ టాయిలెట్లు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు.

News August 25, 2025

నగరంలో లాగింగ్ పాయింట్లు 3 రెట్లు పెరిగాయి

image

నగరంలో వర్షం వస్తే బయటకు వెళ్లాలంటేనే భయం. కారణం వాటర్ లాగింగ్ పాయింట్లు HYDలో పెరగడం గతంలో వాటర్ లాగింగ్ పాయింట్లు 144 ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 436కు పెరిగినట్లు తేలింది. దీంతో అధికారుల్లో ఒక రకమైన ఆందోళన, అన్ని చోట్లా నీరు నిలిచిపోతే నగరం ఏమైపోతుందన్న భయం.. ట్రాఫిక్ పోలీసులు, హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారుల సర్వేలో ఈ వివరాలు తెలిశాయని సమాచారం.