News March 29, 2024
HYD: త్వరలో 24 గంటలు వాటర్ ట్యాంకర్ నీటి సరఫరా
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1711680238518-normal-WIFI.webp)
వచ్చే నెల మొదటి వారం నుంచి 24 గంటల పాటు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దాన కిశోర్ తెలిపారు. HYD ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో వేసవి కార్యాచరణ, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతేడాదితో పోలిస్తే, ఈ సారి ట్యాంకర్ల డిమాండ్ 50 శాతం పెరిగిందన్నారు.
Similar News
News July 8, 2024
గచ్చిబౌలి: స్కిల్ డెవలప్ మెంట్ సమావేశంలో పాల్గొన్న సీఎం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720431353173-normal-WIFI.webp)
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గ గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాప్ కాలేజీలో స్కిల్ డెవలప్మెంట్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం వివిధ రంగాల ప్రముఖుల అభిప్రాయాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు. కాలేజీలో నిర్మాణమవుతున్న కన్వెన్షన్ సెంటర్ను ఆయన పరిశీలించారు.
News July 8, 2024
HYD: ప్లాస్టిక్ సర్జరీలపై ప్రత్యేక సేవలు: డా.లక్ష్మీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720428844575-normal-WIFI.webp)
ప్రపంచ ప్లాస్టిక్ శస్త్రచికిత్స దినోత్సవం సందర్భంగా రేపటి నుంచి ఉస్మానియా హాస్పిటల్లో ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకంగా సేవలు అందించనున్నట్లు ప్లాస్టిక్ సర్జరీ ప్రొఫెసర్, యూనిట్ చీఫ్ డాక్టర్.పలుకూరి లక్ష్మీ తెలిపారు. ఈనెల 15వ తేదీ వరకు రూమ్ నం.202లో ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించి వైద్య సేవలు సర్జరీలు ఉచితంగా పొందవచ్చని వెల్లడించారు. అన్ని రకాల ప్లాస్టిక్ సర్జరీలు చేస్తామని పేర్కొన్నారు.
News July 8, 2024
HYD: శిథిలావస్థలోని భవనాలపై చర్యలేవి!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720421692755-normal-WIFI.webp)
గ్రేటర్ HYD పరిధిలో శిథిలావస్థలో ఉన్న భవనాలపై చర్యలు అంతంత మాత్రంగా ఉన్నాయి. గతేడాది అధికార గణంకాల ప్రకారం.. జీహెచ్ఎంసీ పరిధిలో 620 భవనాలు శిథిలంగా మారాయి. సికింద్రాబాద్లో అత్యధికంగా 155, ఎల్బీనగర్లో 119, చార్మినార్లో 89, ఖైరతాబాద్లో 109, శేరిలిం గంపల్లిలో 62, కూకట్పల్లిలో 92 శిథిల భవనాలు ఉన్నాయి. ఈ భవనాల స్థితిపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలకు పూనుకోలేదు.