News July 6, 2025

HYD: త్వరలో ORR వరకు అన్ని ఎలక్ట్రిక్ బస్సులే..!

image

త్వరలో HYD అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న అన్ని RTC బస్సులను పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులుగా తీసుకురానున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇప్పటికే గ్రేటర్ HYD పరిధి ఉప్పల్, ఖైరతాబాద్, నారాయణగూడ, కాచిగూడ, సికింద్రాబాద్, ప్యారడైజ్ బేగంపేట సహా అనేక ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణ సర్వీసులు అందజేస్తున్నాయి. ఎక్స్ ప్రెస్ ఎలక్ట్రిక్ బస్సుల్లోనూ మహాలక్ష్మి పథకం వర్తింపజేస్తున్నారు.

Similar News

News July 7, 2025

తెలంగాణలో ‘జాగీర్’ ఫైట్!

image

‘తెలంగాణ BRS జాగీరా?’ అని ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కథనం రాజకీయ దుమారం రేపుతోంది. తెలంగాణ కోసం పోరాడింది BRS అని, తెలంగాణ తమ జాగీరే అని ఆ పార్టీ నేతలు పోస్టులు చేస్తున్నారు. ఆంధ్ర పత్రికలు మరోసారి విషం చిమ్ముతున్నాయని ఫైరవుతున్నారు. అయితే BRSని విమర్శిస్తే తెలంగాణను తిట్టినట్లు కాదని కాంగ్రెస్ నేతలు కౌంటరిస్తున్నారు. మళ్లీ సెంటిమెంటును రెచ్చగొడుతున్నారని మండిపడుతున్నారు. దీనిపై మీ కామెంట్?

News July 7, 2025

కడుపులో పెన్నులు.. బయటకు తీసిన వైద్యులు

image

నరసరావుపేటకి చెందిన 28 ఏళ్ల యువతి కడుపులో ఉన్న నాలుగు పెన్నులను వైద్యుడు రామచంద్రారెడ్డి శస్త్ర చికిత్స చేసి వెలికి తీశారు. వాంతులతో వైద్యశాలకు చేరిన యువతకి సిటీ స్కాన్ చేయడం ద్వారా నాలుగు పెన్నులు కడుపులో ఉన్నట్లు గుర్తించారు. అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ విధానంలో ఎటువంటి కోత, కుట్లు లేకుండా వైద్యులు ఈ అరుదైన శాస్త్ర చికిత్స చేశారు.

News July 7, 2025

బ్యాటింగ్, బౌలింగ్ అదరగొట్టారుగా..

image

రెండో టెస్టులో ఇంగ్లండ్‌పై గెలుపుతో గిల్ కెప్టెన్‌గా విజయాల ఖాతా తెరిచారు. ఎడ్జ్‌బాస్టన్‌లో భారత జట్టుకు ఇదే తొలి విజయం. ఈ మైదానంలో ఆడిన గత 8 మ్యాచుల్లో ఏడు ఓడిపోగా ఒక మ్యాచును డ్రా చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్, రెండో ఇన్నింగ్సులో ఆకాశ్ దీప్ ఆరేసి వికెట్లతో అదరగొట్టారు. అటు కెప్టెన్ గిల్ 430 పరుగులతో మరిచిపోలేని ప్రదర్శన చేశారు. జడేజా, పంత్, జైస్వాల్, రాహుల్ తమ వంతు పాత్ర పోషించారు.