News July 7, 2025
HYD: త్వరలో POLYCET ఫేజ్-1 రిజల్ట్

POLYCET-2025 మొదటి ఫేజ్ రిజల్ట్ జులై 4వ తేదీన రావాల్సి ఉండగా ఇప్పటి వరకు రాలేదు. దీంతో కాలేజీల ఆప్షన్స్ ఎంచుకున్న అభ్యర్థులు కంగారు పడుతున్నారు. దీనిపై HYD ఈస్ట్ మారేడ్పల్లి పాలిటెక్నిక్ కాలేజీ బృందం ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపింది. త్వరలో https://tgpolycet.nic.in ఫేజ్-1 రిజల్ట్ డిస్ ప్లే చేయబడతాయని పేర్కొంది. రిపోర్టింగ్ కోసం తేదీలు పొడగించే అవకాశం ఉందని తెలిపింది.
Similar News
News July 7, 2025
VZM: భవానీని అభినందించిన వైఎస్ జగన్

విజయనగరం జిల్లా కొండకరకాం గ్రామానికి చెందిన వెయిట్ లిఫ్టర్ రెడ్డి భవానీకి మాజీ సీఎం జగన్ ‘ఎక్స్’ వేదికగా సోమవారం శుభాకాంక్షలు తెలిపారు. కజకిస్థాన్లో ఇటీవల జరిగిన ఏషియన్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో భవానీ మూడు బంగారు పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. ఆమెకు జగన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని.. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆకాంక్షించారు.
News July 7, 2025
బుట్టాయిగూడెం : ఐటీడీఏ పీవోకు వినతి ఇచ్చిన గిరిజన నేతలు

బుట్టాయిగూడెం మండలం కేఆర్ పురంలో ఐటీడీఏ పీఓ రాముల నాయక్ను టీ నర్సాపురం మండల బంజారా బజరంగీభేరి కమిటీ నాయకులు సోమవారం కలిశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. గిరిజన నాయకులు మాట్లాడుతూ టీ నర్సాపురం మండలంలోని గిరిజన తండాల్లో మౌలిక వసతులను కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్, ఇస్లావత్ ప్రేమ్ చంద్, కృష్ణప్రసాద్ పాల్గొన్నారు.
News July 7, 2025
పెద్దపల్లి: ‘పీఎం కిసాన్ కోసం రైతు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి’

రైతు గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆయా గ్రామాల రైతు వేదికల్లో కొనసాగుతుందని PDPL DAO ఆదిరెడ్డి పేర్కొన్నారు. ఎవరైతే రైతులు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి మాత్రమే PM కిసాన్ నగదు వారి ఖాతాలో జమ అవుతాయని పేర్కొన్నారు. జులై చివరి వారంలో పీఎం కిసాన్ డబ్బులు రైతుల ఖాతాలో జమ అవుతాయన్నారు. ఈ లోగా రైతులు ఆయా గ్రామాల AEOలను సంప్రదించి రైతు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించారు.