News September 20, 2025
HYD: దసరా తర్వాత పాఠశాలల్లో తనిఖీలు..!

HYD, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల ప్రభుత్వ పాఠశాలల తనిఖీకి విద్యాశాఖ ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. ఒక్కో అధికారి రెండు జిల్లాలను తనిఖీ చేయనున్నారు. స్కూళ్లలో పరిశుభ్రత, కొత్త ప్రవేశాలు, డేటా సవరణ, ముఖ గుర్తింపు హాజరు అమలు, PM పోషణ స్కీమ్ అమలు వంటి విషయాలను దసరా తర్వాత ఈ కమిటీలు పరిశీలిస్తాయి. తద్వారా మరింత మెరుగైన ప్రమాణాలతో విద్యను అందించవచ్చని యోచిస్తోంది.
Similar News
News September 20, 2025
BREAKING: HYD: నగరం నుంచి రౌడీ షీటర్ బహిష్కరణ..!

హైదరాబాద్లో రౌడీ షీటర్ మహమ్మద్ అసద్పై 11కు మించి క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. హింసాత్మక స్వభావం, బెదిరింపులు, ప్రత్యర్థులపై హత్యాయత్నాలు చేసిన నేరస్థుడు అతడు. 2024లో అసద్ అనుచరులతో కలిసి ప్రత్యర్థి గ్యాంగ్ సభ్యుడిని హత్య చేశాడు. ఇటీవల మరో గ్యాంగ్పై దాడికి సిద్ధమవుతుండగా తుపాకీ, బుల్లెట్లు, కత్తులు స్వాధీనం చేసుకున్నారు. అతడిని ఏడాదిపాటు నగరం నుంచి బహిష్కరిస్తున్నట్లు CP CV ఆనంద్ తెలిపారు.
News September 20, 2025
HYD: మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం: భట్టి

రాష్ట్రంలో మహిళలను కోటీశ్వరులుగా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. ఈరోజు HYD యూసుఫ్గూడ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. మహిళలను ఆర్థిక, సామాజిక శక్తివంతీకరణ, వ్యాపార శిక్షణ ఇచ్చి, కోటీశ్వరులుగా చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు.
News September 20, 2025
HYD: యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తాం: మంత్రి

HYDలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహను ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు. తమ సమస్యలను వివరించారు. ప్రభుత్వానికి సహకరిస్తూ ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగిస్తామని తెలిపారు. మంత్రి రాజనర్సింహ సానుకూలంగా స్పందించారు. ప్రజలకు ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు అందిస్తోన్న నెట్వర్క్ ఆసుపత్రులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.