News August 26, 2025
HYD: దసరా, దీపావళి, ఛట్ పూజ వేళ ప్రత్యేక రైళ్లు: SCR

దసరా, దీపావళి, ఛట్ పూజ పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మొత్తం 22 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు SCR ప్రకటించింది. ఈ రైళ్లు SEP 4 నుంచి అక్టోబర్ 10 వరకు సేవలు అందిస్తాయని తెలిపింది. సికింద్రాబాద్-తిరుపతి, కాచిగూడ-నాగర్సోల్, సంత్రగాచి-చర్లపల్లి మధ్య ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. సికింద్రాబాద్-తిరుపతి రైలు సెప్టెంబర్ 4వ తేదీ నుంచి అందుబాటులో ఉంటుందని వెల్లడించింది.
Similar News
News August 25, 2025
హైదరాబాదు నుంచి సరికొత్త టూర్ ప్లాన్స్

HYD నుంచి టూర్ వెళ్లాలనుకునే వారికి తెలంగాణ టూరిజం శాఖ కొత్త ప్యాకేజీలు అందుబాటులోకి తెచ్చింది. నగరం నుంచి అరుణాచలం, బెంగళూరు, అన్నవరం ప్రాంతాలకు వెళ్లడానికి వేర్వేరుగా బస్సులను నడుపుతోంది. బెంగళూరు టూర్ 2 రోజులు, అరుణాచలం టూర్ 3 రోజులు, అన్నవరం ట్రిప్ 4 రోజులు ఉండనుంది. పూర్తి వివరాలకు 98485 40371,98481 25947, 98480 07020 నంబర్లకు కాల్ చేయవచ్చని అధికారులు తెలిపారు.
News August 25, 2025
గణేశ్ నిమజ్జనానికి GHMC భారీ ఏర్పాట్లు

హుస్సేన్సాగర్తో సహా HYDలోని 66 చెరువులు, కుంటల్లో GHMC నిమజ్జనానికి ఏర్పాట్లు చేసింది. 41 కృత్రిమ పాయింట్లను ఏర్పాటు చేసింది. 3.10 లక్షల మట్టి గణేశ్ విగ్రహాలు పంపిణీ చేయనుంది. నిమజ్జనానికి 140 స్టాటిక్, 295 మొబైల్ క్రేన్లు సిద్ధం చేశారు. 160 గణేశ్ యాక్షన్ టీమ్లు, 14,486 పారిశుద్ధ్య కార్మికులు రంగంలోకి దిగనున్నారు. 13 కంట్రోల్ రూములు, 309 మొబైల్ టాయిలెట్లు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు.
News August 25, 2025
నగరంలో లాగింగ్ పాయింట్లు 3 రెట్లు పెరిగాయి

నగరంలో వర్షం వస్తే బయటకు వెళ్లాలంటేనే భయం. కారణం వాటర్ లాగింగ్ పాయింట్లు HYDలో పెరగడం గతంలో వాటర్ లాగింగ్ పాయింట్లు 144 ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 436కు పెరిగినట్లు తేలింది. దీంతో అధికారుల్లో ఒక రకమైన ఆందోళన, అన్ని చోట్లా నీరు నిలిచిపోతే నగరం ఏమైపోతుందన్న భయం.. ట్రాఫిక్ పోలీసులు, హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారుల సర్వేలో ఈ వివరాలు తెలిశాయని సమాచారం.