News March 29, 2024
HYD: దానం వ్యాఖ్యలపై మీ కామెంట్?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1711687868026-normal-WIFI.webp)
BJPతో కలిసి BRS పనిచేయనుందని స్వయంగా KTR చెప్పడంతోనే దాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్లో చేరానని ఖైరతాబాద్ MLA, సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ స్పష్టం చేశారు. ఓ టీవీ ఛానల్లో ఆయన మాట్లాడుతూ.. BJPతో కలిస్తే BRS సెక్యులర్ పార్టీ ఎలా అవుతుందని తాను ప్రశ్నించానన్నారు. గతంలో KCR అపాయింట్మెంట్ దొరకడమే కష్టమని కానీ ప్రస్తుతం రేవంత్రెడ్డి అందరికీ ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. మీ కామెంట్?
Similar News
News July 8, 2024
HYD: డ్రగ్స్ తీసుకున్న 12 మందిపై కేసు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720444848390-normal-WIFI.webp)
డ్రగ్స్ తీసుకున్న 12 మందిని మేడ్చల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ పట్టణానికి చెందిన కొందరు వ్యాపారస్థులు రాజస్థాన్ నుంచి డ్రగ్స్ను కొనుగోలు చేసి సేవిస్తున్నారని పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. డ్రగ్స్ కొనడం, సేవించడం నేరమని ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు
News July 8, 2024
HYD: ప్లాస్టిక్ సర్జరీలపై ప్రత్యేక సేవలు: డా.లక్ష్మీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720426762616-normal-WIFI.webp)
ప్రపంచ ప్లాస్టిక్ శస్త్రచికిత్స దినోత్సవం సందర్భంగా రేపటి నుంచి ఉస్మానియా హాస్పిటల్లో ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకంగా సేవలు అందించనున్నట్లు ప్లాస్టిక్ సర్జరీ ప్రొఫెసర్, యూనిట్ చీఫ్ డాక్టర్.పలుకూరి లక్ష్మీ తెలిపారు. ఈనెల 15వ తేదీ వరకు రూమ్ నం.202లో ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించి వైద్య సేవలు సర్జరీలు ఉచితంగా పొందవచ్చని వెల్లడించారు. అన్ని రకాల ప్లాస్టిక్ సర్జరీలు చేస్తామని పేర్కొన్నారు.
News July 8, 2024
HYD: శిథిలావస్థలోని భవనాలపై చర్యలేవి!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720421865156-normal-WIFI.webp)
గ్రేటర్ HYD పరిధిలో శిథిలావస్థలో ఉన్న భవనాలపై చర్యలు అంతంత మాత్రంగా ఉన్నాయి. గతేడాది అధికార గణంకాల ప్రకారం.. జీహెచ్ఎంసీ పరిధిలో 620 భవనాలు శిథిలంగా మారాయి. సికింద్రాబాద్లో అత్యధికంగా 155, ఎల్బీనగర్లో 119, చార్మినార్లో 89, ఖైరతాబాద్లో 109, శేరిలిం గంపల్లిలో 62, కూకట్పల్లిలో 92 శిథిల భవనాలు ఉన్నాయి. ఈ భవనాల స్థితిపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలకు పూనుకోలేదు.