News July 3, 2024
HYD: ‘దోస్త్’ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్.. గడువు పొడిగింపు
డిగ్రీలో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న మూడో దశ దోస్త్ కౌన్సెలింగ్కు నామమాత్రపు స్పందన కనిపిస్తోంది. దీంతో ఈ విడత కౌన్సెలింగ్కు రిజిస్ట్రేషన్ గడువు ఈనెల 4వ తేదీ వరకూ పొడిగించారు. వాస్తవానికి ఇది మంగళవారంతో ముగిసింది. ఇప్పటి వరకు 56,910 మంది మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మూడో దశ సీట్ల కేటాయింపు మాత్రం ముందుగా ప్రకటించామని, ఈనెల 6వ తేదీన చేపట్టబోతున్నట్లు ప్రొ.ఆర్.లింబాద్రి తెలిపారు.
Similar News
News September 23, 2024
HYD: గీతం యూనివర్సిటీ రూ.1 కోటి విరాళం
వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి గీతం యూనివర్సిటీ రూ.కోటి విరాళం అందజేశారు. గీతం యూనివర్సిటీ ప్రెసిడెంట్, ఎంపీ శ్రీ భరత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచిన వారిని ముఖ్యమంత్రి అభినందించారు.
News September 23, 2024
HYD: అక్రమ నల్లా కనెక్షన్ గుర్తిస్తే కాల్ చేయండి: MD
అనుమతులు లేకుండా అక్రమ నల్లా కనెక్షన్లు తీసుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి హెచ్చరించారు. HYD నగరంలో ఎవరైనా అక్రమ నల్లా కనెక్షన్లు గుర్తించినా, డొమెస్టిక్ కనెక్షన్ తీసుకుని కమర్షియల్ అవసరాలకు వినియోగించినట్లు గుర్తిస్తే విజిలెన్స్ బృందానికి 9989998100, 9989992268 ఫోన్ నంబర్ల ద్వారా సమాచారం అందించాలని కోరారు.
News September 23, 2024
చేవెళ్ల: రూ.38 కోట్లు విడుదల: ఎంపీ
స్వదేశీ అభియాన్ పథకం కింద రూ.99 కోట్లతో వికారాబాద్ అనంతగిరి కొండలను అభివృద్ది చేస్తామని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. దీనిలో మొదటి దశలో రూ.38 కోట్లు విడుదలయ్యాయని పేర్కొన్నారు. శంకర్పల్లి, మర్పల్లి రోడ్లు దెబ్బతిన్నాయని, రూ.400 కోట్లు నిధులు మంజూరు చేయాలని మంత్రి నితిన్ గడ్కరీని అడుగుతానని తెలియజేశారు.