News September 6, 2025

HYD: నంది వాహనం ఎక్కిన ‘శివ’పుత్రుడు

image

వినాయక నిమజ్జనోత్సవంలో ‘శివ’పుత్రులు దర్శనమిచ్చారు. అవును.. హిమాయత్‌నగర్‌లో ఈ దృశ్యం భక్తులను కనువిందు చేసింది. శనివారం ట్యాంక్‌బండ్‌కు ఎడ్లబండి మీద ఓ వినాయకుడిని నిమజ్జనానికి తీసుకొచ్చారు. రథసారథిగా శివుడి వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నంది వాహనం ఎక్కి గణపయ్య వస్తున్నాడు అంటూ భక్తులు పరవశించిపోయారు. ఈ వినూత్న ఆలోచన బాగుంది కదూ.

Similar News

News September 7, 2025

చంద్రుడిని చూశారా?

image

సంపూర్ణ చంద్రగ్రహణం ప్రక్రియ ప్రారంభమైంది. వెలుగులు ప్రసరిస్తూ ప్రకాశవంతంగా మెరిసిపోతున్న చందమామను మెల్లగా చీకటి కమ్మేస్తోంది. 11 గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది మొత్తం 82 నిమిషాల పాటు కొనసాగనుంది. ఇప్పటికే దేశ ప్రజలు ధగధగా మెరుస్తున్న చంద్రుడిని చూస్తూ పులకరిస్తున్నారు. మరి మీరు చందమామను చూశారా?

News September 7, 2025

ఆదిలాబాద్: బెట్టింగ్‌తో జీవితం నాశనం చేసుకోవద్దు..!

image

ఇటీవల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి చెందిన ఓ బ్యాంకు క్యాషియర్ ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసై దొంగగా మారి కటకటాల పాలైన సంగతి తెలిసిందే. ఇలా ఇప్పటికే పలువురు తమ జీవితాలను నాశనం చేసుకున్నారు. ఈనెల 9న ఆసియా కప్ టీ 20 క్రికెట్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్న నేపథ్యంలో యువత బెట్టింగ్ జోలికి వెళ్లొద్దని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకసారి బెట్టింగ్ అలవాటైతే దానిని వదిలించుకోవడం చాలా కష్టమని పేర్కొంటున్నారు.

News September 7, 2025

జగిత్యాల కలెక్టరేట్ ముట్టడికి పిలుపు

image

పింఛన్ల పెంపు కోసం మంగళవారం జరగనున్న కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలని MRPS అధికార ప్రతినిధి బెజ్జంకి సతీష్ పిలుపునిచ్చారు. నేడు జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, BD కార్మికులకు పెన్షన్లు పెంచుతామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అయితే ఇప్పటికీ పెంచలేదని గుర్తు చేశారు. ఈ సందర్భంగా మహిళల వివరాలను సేకరించారు.