News March 1, 2026

HYD: నకిలీ ఇన్సూరెన్స్‌లు.. 9 మంది అరెస్ట్

image

ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల పేర్లతో నకిలీ వాహన బీమా పత్రాలను సృష్టిస్తున్న 9మంది ముఠా సభ్యులను జీడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి భారీగా నకిలీ పత్రాలు, స్టాంపులు, కంప్యూటర్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇన్‌స్పెక్టర్ గడ్డం మల్లేశ్ వెల్లడించారు. అవసరంలో ఉన్న వాహనదారులను లక్ష్యంగా చేసుకుని మోసాలు చేస్తున్నారు. ప్రజలు అధికారిక వెబ్‌సైట్ల ద్వారానే బీమా తీసుకోవాలని పోలీసులు సూచించారు.

Similar News

News March 1, 2026

నెల్లూరు GGH ఘటనపై స్పందించిన కలెక్టర్, ఎస్పీ

image

నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (GGH)లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై కలెక్టర్ హిమాన్షు శుక్లా. ఎస్పీ తక్షణమే స్పందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు పరిస్థితిని సమీక్షించారు. రోగులు, వారి కుటుంబ సభ్యులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఆసుపత్రిలోని రోగులందరూ సురక్షితంగా ఉన్నారని, ఎవరికి ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదని కలెక్టర్ తెలిపారు.

News March 1, 2026

నిఘా నీడలో నెల్లూరు: ఎస్పీ

image

జిల్లాలో నేరాల నియంత్రణే లక్ష్యంగా నెల్లూరు ఎస్పీ అజిత వేజెండ్ల IPS ఆదేశాల మేరకు పోలీసులు సరికొత్త సాంకేతికతతో డ్రోన్ నిఘాను ముమ్మరం చేశారు. పట్టణ శివార్లు, నిర్మానుష్య ప్రాంతాలు, పాడుబడిన భవనాలు, తోటలపై డ్రోన్లతో నిరంతరం నిఘా ఉంచుతున్నామన్నారు. గంజాయి విక్రయాలు, బహిరంగంగా మద్యం తాగడం, పేకాట, ఈవ్ టీజింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.

News March 1, 2026

రెబ్బెన: భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య (UPDATE)

image

రెబ్బెన మండలం రాజారాం గ్రామానికి చెందిన పూదరి కిరణ్(32) సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. కిరణ్- సరిత దంపతులకు 12 ఏళ్ల కుమార్తె ఉంది. కాగా కిరణ్ తాగి వచ్చి భార్యతో తరచూ గొడవపడేవాడు. దీంతో ఆమె మూడు నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన కిరణ్.. శనివారం రాత్రి ఇంట్లో ఊరేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.