News August 10, 2025
HYD- నాగ్పూర్ వందేభారత్ ట్రైన్కు ఆదరణ అంతంతే!

కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన HYD- నాగ్పూర్ వందేభారత్ ట్రైన్కు ఆదరణ అంతంత మాత్రమే లభిస్తున్నట్లు తెలుస్తోంది. గతేడాది ఫిబ్రవరి 19న ఈ ట్రైన్ను 20 కోచ్లతో ప్రారంభించారు. అయితే ప్రయాణికులు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో కోచ్ల సంఖ్య ఒక్కసారిగా 8కి తగ్గించారు. అయినా ఆక్యుపెన్సీ రేషియో 70% మాత్రమే ఉంది. డిమాండ్లేని ఈ రూట్లో ట్రైన్ ప్రారంభించడంతో ఈ పరిస్థితి నెలకొందని పలువురు చెబుతున్నారు.
Similar News
News August 10, 2025
కొంపల్లి: జర భద్రం.. మాయ‘దారి’ మనకొద్దు

సుచిత్ర- కొంపల్లి- మేడ్చల్ దారిలో ట్రాఫిక్ జామ్ అవ్వడంతో లేని దారిని సృష్టించి బైక్లను ఫుట్పాత్, డ్రైనేజీ మీద నుంచి వెళుతున్నారు. ఇలా వెళ్లడం ప్రమాదకరం అని అధికారులు హెచ్చరిస్తున్నారను. దారి పొడవునా రాకపోకలకు ఇబ్బంది నెలకొందని ఈ తరహా ప్రయాణాలతో ఇతరులకు ప్రమాదం జరిగుతుందని అధికారులు చెబుతున్నారు. జర ఉన్న దారిలో వెళ్లి ఉన్నవారికి తోడుగా ఉండు సోదరా అని పలువురు SMలో కామెంట్లు చేస్తున్నారు.
News August 10, 2025
HYD: రాజగోపాల్రెడ్డిపై క్రమశిక్షణా కమిటీ చర్యలు?

నాంపల్లిలోని గాంధీ భవన్లో కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ భేటీ అయ్యింది. ఈ సమావేశంలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, వరంగల్ నేత కొండా మురళీ వ్యాఖ్యలపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. వీరిపై ఏదో రకంగా చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
News August 10, 2025
HYD: పెళ్లైన గంటల్లోనే గుండెపోటుతో యువకుడి మృతి

వివాహమైన కొద్ది గంటల్లోనే ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికుల వివరాలిలా.. బడంగ్పేట్ లక్ష్మీదుర్గకాలనీకి చెందిన ఈవెంట్స్ మేనేజర్ విశాల్ కుమార్ (25)కు ఈ నెల 7న వివాహం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున ఇంటికి చేరుకోగానే విశాల్ అస్వస్థకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు డీఆర్డీవో అపోలో ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం గ్లోబల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.