News September 6, 2025
HYD: నిమజ్జనోత్సవాల్లో తాగునీటి శిబిరాలు

వినాయక నిమజ్జనానికి వచ్చే భక్తుల దాహార్తిని తీర్చడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. నేడు భారీ శోభయాత్రలు జరగనున్న నేపథ్యంలో డైరెక్టర్లు, సీజీఎంలు, జీఎంలతో శుక్రవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వినాయక నిమజ్జనానికి వచ్చే భక్తుల దాహార్తిని తీర్చడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. నగరంలో 123 శిబిరాలు ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు.
Similar News
News September 6, 2025
క్రేన్ నం.4 వద్ద ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం

ఖైరతాబాద్ బడా గణేశుడి శోభాయాత్ర భారీ భద్రత మధ్య అట్టహాసంగా కొనసాగుతోంది. ఈ ఊరేగింపును చూసేందుకు వచ్చిన భక్తులతో నగరం సంద్రాన్ని తలపిస్తోంది. ట్యాంకు బండ్పై క్రేన్ నం.4 వద్ద అధికారులు నిమజ్జనం బడాగణేశ్ను గంగమ్మఒడికి చేర్చనున్నారు. భక్తులు భారీగా చేరుకుంటుండంటంతో మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని నిర్వహకులు చెబుతున్నారు.
News September 6, 2025
గణేశ్ మహా నిమజ్జనానికి GHMC అన్ని ఏర్పాట్లు

గ్రేటర్ HYDలో నేడు గణేశ్ మహా నిమజ్జనం జరుగనుంది. నిమజ్జనం సజావుగా సాగేందుకు GHMC అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలీస్, ఇతర శాఖలతో సమన్వయం చేస్తూ కార్యక్రమం సాఫీగా జరగడానికి చర్యలు తీసుకుంది. స్వచ్ఛతకు ప్రాధాన్యం ఇస్తూ 15వేల మంది సిబ్బందితో 24×7 పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతోంది. నగర వ్యాప్తంగా శోభాయాత్రలను మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ ఆర్వీ కర్ణన్ నిమజ్జనాన్ని మానిటర్ చేస్తున్నారు.
News September 6, 2025
ఖైరతాబాద్ గణపతికి శోభయాత్ర రూట్ మ్యాప్

ఖైరతాబాద్ మహా గణపతికి కమిటీ సభ్యుడు రాజ్కుమార్ కలశ పూజ చేశారు. కొద్దిసేపట్లో మహా గణపతి గంగమ్మఒడికి బయలుదేరనున్నారు. ఈ శోభాయాత్ర టెలిఫోన్ భవన్, సచివాలయం మీదుగా ట్యాంక్ బండ్ వరకు చేరుకోనుంది. బడా గణేశ్ – సైఫాబాద్ ఓల్డ్ పీఎస్- ఇక్బాల్ మినార్- తెలుగుతల్లి ఫ్లైఓవర్- అంబేడ్కర్ విగ్రహం నుంచి ట్యాంక్ బండ్కు చేరుకోనుంది. భక్తులు పెద్ద సంఖ్యలో హుస్సేన్ సాగర్కు తరలివస్తున్నారు.