News September 18, 2024
HYD: నీటి వారోత్సవాల్లో మంత్రి ఉత్తమ్

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నేడు జలశక్తి మంత్రిత్వ శాఖ నిర్వహించిన 8వ అంతర్జాతీయ నీటి వారోత్సవ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రపతి అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతర్జాతీయంగా నీటి నిర్వహణ, అభివృద్ధి, సహకారంపై కీలకమైన అంశాలపై చర్చించారు. జలవనరుల నిర్వహణలో ప్రభుత్వం చేస్తున్న కృషిని మంత్రి ప్రదర్శించారు.
Similar News
News July 6, 2025
బోరబండలో భార్యను హత్య చేసిన భర్త

HYD బోరబండ PS పరిధిలో భార్యను భర్త హత్య చేశాడు. స్థానికులు తెలిపిన వివరాలిలా.. సోనీ, నర్సింలు దంపతులు. మద్యానికి బానిసై నర్సింలు తాగివచ్చి తరుచూ చిత్రహింసలకు గురి చేసేవాడు. ఈ నేపథ్యంలో భార్య సోనీ తన పుట్టింటికి వెళ్లింది. తిరిగి వచ్చిన తర్వాత 3 రోజులుగా మళ్లీ చిత్రహింసలు పెడుతూ విచక్షణారహితంగా కొట్టడంతో సోనీ మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News July 6, 2025
HYD: నేడు సాలార్ జంగ్ మ్యూజియానికి సెలవు

మొహరం నేపథ్యంలో బీబీ కా ఆలం ఊరేగింపులో భాగంగా నేడు HYDలోని సాలార్ జంగ్ మ్యూజియానికి సెలవు ఉంటుందని మ్యూజియం అడ్మినిస్ట్రేటివ్ అధికారి తెలిపారు. అదేవిధంగా బీబీ కా ఆలం ఊరేగింపు చార్మినార్ ప్రధాన మార్గాల్లో కొనసాగనున్న నేపథ్యంలో చార్మినార్లోకి ప్రవేశం ఉండదన్నారు. సోమవారం తిరిగి సాలార్ జంగ్ మ్యూజియంలోకి ప్రవేశం ఉంటుందని పేర్కొన్నారు.
-SHARE IT
News July 6, 2025
HYD: మొహరం స్పెషల్.. బీబీ కా అలమ్ గురించి తెలుసా..!

బీబీ కా ఆలం హైదరాబాద్లోని ప్రముఖ శియా ముస్లిం పవిత్ర ధ్వజం(అలమ్)గా ప్రసిద్ధి చెందింది. ఇది ప్రతి సంవత్సరం మొహరం నెలలో, ముఖ్యంగా ఆశురా రోజున వైభవంగా జరిగే ఊరేగింపులో ప్రజల దర్శనార్థం ఉంచుతారు. ఈ అలమ్ను ఖాసా అలంకరించిన ఏనుగుపై ఊరేగించడం అనేది కుతుబ్ షాహీ, ఆసఫ్ జాహీ పరిపాలన కాలం నాటి సంప్రదాయం. దీన్ని బీబీ ఫాతిమా(ప్రవక్త మహమ్మద్ కుమార్తె) స్మృతిగా భావిస్తారు.