News January 27, 2025

HYD: నుమాయిష్‌కు పోటెత్తిన సందర్శకులు

image

ఆదివారం సెలవు దినం కావడంతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరుగుతున్న నుమాయిష్‌కు సందర్శకులు పోటెత్తారు. గణతంత్ర వేడుకలు ఉండటంతో దాదాపు 80 వేల మంది సందర్శకులు వచ్చినట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు నిరంజన్ తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అటవీ, కార్మిక, జైళ్ల శాఖల స్టాళ్లలో ప్రభుత్వ పథకాలు, ప్రగతిపై సందర్శకులకు వివరించినట్లు పేర్కొన్నారు.

Similar News

News February 16, 2026

పార్వతీపురం: గిరిజన ప్రాంతాలు మౌలిక వసతులుపై సమవేశం

image

గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులుపై జిల్లా కలెక్టర్లుతో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సోమవారం సమావేశం నిర్వహించారు. అమరావతిలోని మంత్రి కార్యాలయంలో అరకు పార్లమెంట్ పరిధిలో ఉన్న జిల్లా అల్లూరి, పార్వతీపురం కలెక్టర్లు, ఎస్పీలు, ఎమ్మెల్యేలుతో చర్చించారు. ప్రజలు సంక్షేమం, లా అండ్ ఆర్డర్, గిరిజనాభివృద్ధి తదితర అంశాలపై మాట్లాడారు.

News February 16, 2026

17కి డోర్నకల్ మున్సిపాలిటీ ప్రమాణ స్వీకారం వాయిదా

image

డోర్నకల్ మున్సిపల్ పాలకవర్గం ప్రమాణ స్వీకారం రేపటికి వాయిదా పడింది. హైదరాబాదు క్యాంపు నుంచి డోర్నకల్‌కు వార్డు కౌన్సిలర్ అభ్యర్థులు చేరుకున్నారు. మరిపెడ లో కౌన్సిలర్ అభ్యర్థులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఎమ్మెల్యే మరిపెడలో ఉండిపోవడంతో డోర్నకల్ ప్రమాణ స్వీకారానికి మధ్యాహ్నం ఒకటిన్నర వరకే ఉండడంతో వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు.

News February 16, 2026

బిల్ గేట్స్ ప్రతినిధులతో వర్చువల్‌గా పాల్గొన్న పల్నాడు కలెక్టర్

image

బిల్ గేట్స్ అమరావతి పర్యటనలో భాగంగా సోమవారం సచివాలయంలో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు. గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్ బృందం పాల్గొంది. ఆరోగ్యం, విద్య, సాంకేతిక రంగాల్లో సహకారం పై దృష్టి పెట్టారు. రాష్ట్ర అభివృద్ధికి భాగస్వామ్యంపై చంద్రబాబు వివరించారు. వర్చువల్ విధానంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ కృత్తికా శుక్లా పాల్గొన్నారు.