News March 23, 2025
HYD: ‘నెట్ వర్కింగ్ను సద్వినియోగం చేసుకోండి’

యువత నెట్ వర్కింగ్ అవకాశాలను సద్వినియోగం చేసుకోని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఏఐ డేటా ఫెస్ట్ ప్రతినిధి, ప్రముఖ పారిశ్రామిక డేటా నిపుణులు ధావల్ పటేల్ సూచించారు. ఏఐ డేటా ఫెస్ట్ ఆధ్వర్యంలో శనివారం నారాయణగూడలో విద్యార్థులకు, యువతకు నెట్ వర్కింగ్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఏఐ డేటా సైన్స్ అనలిటిక్స్లో పురోగతులను పరిశోధించడానికి మంచి ఫ్లాట్ ఫారం లా ఇలాంటి వర్క్ షాపులు దోహద పడతాయన్నారు.
Similar News
News February 11, 2026
మేడ్చల్: ఎంసీపల్లిలో ఓటేసిన 102 ఏళ్ల ఎల్లమ్మ

మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో 102 ఏళ్లున్న దాసరి ఎల్లమ్మ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు ఎందుకు వేయాలని భావిస్తున్న ఎందరికో ఈ బామ్మ ఆదర్శంగా నిలిచారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు తప్పకుండా వినియోగించుకోవాలని ఎల్లమ్మ చెబుతున్నారు.
News February 11, 2026
ఇస్త్రీ చేస్తూ రూ.2లక్షలకు పైగా సంపాదన.. ట్వీట్ వైరల్!

సామాన్య ఇస్త్రీ షాపు యజమాని సంపాదన చూసి ఓ మహిళ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. ప్రతిరోజూ వందలాది బట్టల ఇస్త్రీ, డ్రై క్లీనింగ్ ద్వారా నెలకు రూ.2 లక్షలకు పైగా ఆ దంపతులు సంపాదిస్తున్నారని తెలిసి ఆమె ఆశ్చర్యపోయారు. ఖర్చులు పోను రూ. 2.37 లక్షలు పొందుతున్నారని, ఇది ఐటీ ఉద్యోగి జీతంతో సమానమని తెలిపారు. ఏ వృత్తి అయినా అంకితభావంతో చేస్తే IT కొలువులకు మించిన ఆదాయం పొందవచ్చని వీరు నిరూపిస్తున్నారు.
News February 11, 2026
చెత్త సేకరణలో కీలక మార్పు.. ఇకపై 4 డబ్బాల్లో!

కేంద్రం ‘సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026’ పేరుతో సరికొత్త చెత్త సేకరణ విధానాన్ని తెచ్చింది. ఇకపై ఇంటి వద్దే వ్యర్థాలను నాలుగు రకాలుగా వేరు చేయడం తప్పనిసరి. గతంలో మూడు ఉండగా ఇప్పుడు ఒక డబ్బా పెరిగింది. తడి వ్యర్థాలకు గ్రీన్, పొడి వ్యర్థాలకు బ్లూ, ప్యాడ్లు-డైపర్ల కోసం రెడ్, ఇంట్లోని మెడికల్ వ్యర్థాల కోసం నలుపు డబ్బాలను వాడాలి. పర్యావరణ పరిరక్షణ, రీసైక్లింగ్ సులభతరం చేయడానికి ఈ మార్పు చేశారు.


