News March 3, 2025

HYD: నేడు ఢిల్లీకి సీఎం, డిప్యూటీ సీఎం

image

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించేందుకు CM రేవంత్ రెడ్డి, డిప్యూటీ CM భట్టి విక్రమార్క ఇవాళ ఢిల్లీలో కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలపై కేంద్రమంత్రులతో సమాలోచనలు చేయనున్నారు. ఈ భేటీలో కేంద్రం నుంచి రాష్ట్రానికి మరింత సహాయం పొందేందుకు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని వెల్లడించారు.

Similar News

News March 3, 2025

HYD: రోడ్ల మరమ్మతులపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్

image

హైదరాబాద్: రోడ్ల మరమ్మతులపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌(హ్యామ్) తరహాలో రోడ్ల నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది. దీనిపై ఆర్‌అండ్‌బీ శాఖాధికారులు కసరత్తు ప్రారంభించారు. హైదరాబాద్ రీజినల్ రింగ్‌‌రోడ్డు ప్రక్రియ ఊపందుకున్న నేపథ్యంలో.. రాష్ట్రంలోని ఇతర రహదారులను కూడా మెరుగుపరచడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది.

News March 3, 2025

రావిర్యాలలో ఏటీఎంను చోరీ.. మూడు బృందాలతో గాలింపు

image

రావిర్యాలలో SBI <<15626678>>ఏటీఎంను చోరీ<<>> ఘటనపై పోలీసులు 3 బృందాలతో గాలిస్తున్నారు. హరియాణా దొంగలుగా భావిస్తున్న పోలీసులు.. ముంబైవైపు వారు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. 2019లోనూ ఇదే తరహాలో ఆదిభట్లలో ఏటీఎం చోరీ జరిగినట్లు తెలుస్తోంది. కాగా శనివారం అర్ధరాత్రి దాటాక అలారం మోగకుండా కేబుళ్లను తెంపేసి, సీసీ కెమెరాలపై నల్లటి స్ప్రేను చల్లి ఏటీఎం ధ్వంసం చేసి రూ.29.70 లక్షల నగదును దోచుకెళ్లారు.

News March 3, 2025

రాష్ట్రంలో ఆ మూడు జిల్లాలే TOP

image

రాష్ట్ర గణాంకాల నివేదిక-2024 వివరాలు విడుదలయ్యాయి. ఈ నివేదికలో కీలక అంశాలను పొందుపరిచారు. స్థూల జిల్లా జాతీయ ఉత్పత్తిలో 2022-23లో రంగారెడ్డి జిల్లా రూ.2.85 లక్షల కోట్లతో ఉండగా, హైదరాబాద్ రూ.2.30 లక్షల కోట్లు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రూ.88,940 కోట్లతో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు, తదనుగుణంగా చర్యలు చేపడుతున్నారు.

error: Content is protected !!