News September 13, 2025
HYD: నేడు, రేపు MSME బిజినెస్ ఎక్స్పో

BNI హైదరాబాద్ ప్రతినిధులు అనిరుధ్ కొణిజేటి బృందం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. సెప్టెంబర్ 13, 14న శంషాబాద్లో MSME ఎక్స్పో నిర్వహిస్తామని తెలిపారు. BNI ఆధ్వర్యంలో జరిగే ఈ ఎక్స్పోలో చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థల ఉత్పత్తులు, సేవలు ప్రదర్శించబడనున్నట్లు వివరించారు. ఎక్స్పో విశేషాలను సీఎంకు వివరిస్తామని చెప్పారు.
Similar News
News September 13, 2025
‘సిగాచీ’పై నివేదిక రెడీ.. ఇక సర్కారు నిర్ణయమే తరువాయి

పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 45 మంది మరణించిన ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ విచారణను పూర్తి చేసింది. ఈ మేరకు కమిటీ సభ్యులు కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ కు విచారణ నివేదికను అందజేశారు. ప్రమాదానికి కారణాలతోపాటు ఇటువంటి ప్రమాదాలు జరుగకుండా తీసుకోవాల్సిన చర్యలను కమిటీ సభ్యులు కూలంకుషంగా నివేదికలో పొందుపరిచారు.
News September 13, 2025
IOBలో 127 పోస్టులకు నోటిఫికేషన్

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(IOB)లో 127 స్పెషలిస్టు ఆఫీసర్స్ ఉద్యోగాలకు ప్రకటన వెలువడింది. అభ్యర్థులు అక్టోబర్ 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ/బీఆర్క్/బీటెక్/బీఈ/ ఎంఎస్సీ/ఎంఈ/ఎంటెక్/ఎంబీఏ/పీజీడీఎం/పీజీడీబీఏలో ఉత్తీర్ణత సాధించాలి. 01-09-2025 నాటికి 25-40 ఏళ్లు ఉన్నవారు అర్హులు. ఆన్లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్సైట్: <
News September 13, 2025
KNR: ‘బొడ్డెమ్మ.. బొడ్డెమ్మా కోల్.. బిడ్డాలెందారు కోల్’

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామంలో వాడవాడలా బొడ్డెమ్మ పున్నం పండుగ ఘనంగా ప్రారంభమైంది. తీరొక్క పూలతో బొడ్డెమ్మను అలంకరించిన మహిళలు ‘బొడ్డెమ్మ.. బొడ్డెమ్మా కోల్.. బిడ్డాలెందారు కోల్’ అంటూ ఆనవాయితీగా పాడుతున్న పాటలను ఆలకిస్తూ చప్పట్లు కొడుతూ గౌరమ్మను కొలుచుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. తెలంగాణ సాంప్రదాయాన్ని చాటే ఈ పండుగను జరుపుకోవండం ఎంతో సంతోషంగా ఉందని వనితలు అన్నారు.