News August 19, 2025

HYD: నేడు OUలో 84వ స్నాతకోత్సవం

image

ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో ఇవాళ 84వ స్నాతకోత్సవం నిర్వహిస్తున్నట్లు VC ప్రొ. కుమార్ మొలుగరం తెలిపారు. ముఖ్య అతిథిగా యూనివర్సిటీ ఛాన్సిలర్ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఇస్రో ఛైర్మన్ డా.నారాయణన్ హాజరుకానున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. గౌరవ డాక్టరేట్‌ను ఇస్రో ఛైర్మన్‌కు ఇవ్వాలని వర్సిటీ పాలకమండలి నిర్ణయించింది. ఇప్పటికే 49 మంది ప్రముఖులను డాక్టరేట్లతో ఓయూ సత్కరించింది.

Similar News

News September 13, 2025

HYD: పెళ్లి సంబంధాల పేరుతో రూ.25 లక్షల మోసం.. అరెస్ట్

image

పెళ్లి సంబంధాలు చూస్తామని మ్యాట్రిమోనీ వెబ్ సైట్‌లో మోసం చేసిన అనీశ్(33)ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేక్ వీడియో కాల్స్ చేయించి, మెప్పించి, చివరికి అకౌంట్‌లో నుంచి రూ.25 లక్షలు కాజేసినట్లు ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు. పోలీసులు విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకున్నారు.

News September 13, 2025

HYD: నిర్లక్ష్య రైడింగ్ ప్రాణాన్ని బలిగొంది..!

image

ఘట్‌కేసర్ పరిధి అన్నోజిగూడలో నిర్లక్ష్య రైడింగ్ ఓ ప్రాణాన్ని బలి తీసుకుంది. విధులకెళ్తున్న 57 ఏళ్ల ఎలక్ట్రీషియన్ చంద్రారెడ్డిని ఓ మైనర్ బాలుడు నిర్లక్ష్యంగా బైక్‌‌ నడిపి, ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. బైక్ నడిపిన 16 ఏళ్ల బాలుడితోపాటు, వాహన యజమాని అయిన అతడి తల్లిపై కేసు నమోదు చేశారు. మైనర్లకు వాహనాలు ఇస్తే పేరెంట్స్‌పై కేసులు నమోదు చేస్తామన్నారు.

News September 13, 2025

HYD: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై కవిత ఆగ్రహం

image

పేద విద్యార్థుల చదువులపై ప్రభుత్వానికి ఏమాత్రం పట్టింపు లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత HYDలో విమర్శించారు. రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయకపోవడంతో ఉన్నత విద్యాసంస్థలు బంద్ అయ్యే పరిస్థితి నెలకొందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 15వ తేదీ నుంచి విద్యాసంస్థలను బంద్ చేస్తున్నట్లు తెలిపారు. బకాయిలను చెల్లించాలని కవిత డిమాండ్ చేశారు.