News February 24, 2025

HYD: పదో తరగతి చదువుతున్నారా..? మీకోసమే!

image

పదో తరగతి పూర్తయ్యాక డైరెక్ట్ ఇంజినీరింగ్ విద్యను అభ్యసించడానికి డిప్లొమా పాలిటెక్నిక్ విద్య అందుబాటులో ఉంది. ఇందుకోసం పాలీసెట్ ప్రవేశ పరీక్ష మే 16వ తేదీన జరుగుతుందని రామంతపూర్ జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ అధికారులు తెలిపారు. ఇందుకు ఇప్పటి నుంచే విద్యార్థులు ప్రిపేర్ అయితే మంచిగా రాణించే అవకాశాలు ఉంటాయన్నారు.

Similar News

News February 24, 2025

HYD: HICCలో బయో ఏషియా సదస్సు

image

జీవ విజ్ఞాన రంగంలోని పరిశోధకులు, పారిశ్రామికవేత్తలు, విధాన రూపకర్తలను ఒక వేదికపైకి తీసుకొచ్చే బయో ఏషియా సదస్సుకు రంగం సిద్ధమైంది. 22వ సదస్సు ఈ నెల 25, 26 తేదీల్లో HYDలోని హెచ్‌ఐసీసీ వేదికగా జరగనుంది. 50 దేశాలకు చెందిన దాదాపు 3,000 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు. CM రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా రేపు సదస్సు ప్రారంభం కానుంది.

News February 24, 2025

HYD: దాయాదుల మ్యాచ్.. భారీగా పందేలు

image

నిన్న దాయాదుల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌ సందర్భంగా రూ.కోట్లల్లో పందేలు సాగాయి. బంతిబంతికి రూ.2000-2500 వరకు పందేలు వేసుకున్నారు. చందానగర్, మాదాపూర్, ఎల్బీనగర్, గోషామహల్, చిలకలగూడ, ముషీరాబాద్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో పెద్దఎత్తున సొమ్ము చేతులు మారినట్లు తెలుస్తోంది. మాదాపూర్‌లో ఓ స్థిరాస్తి వ్యాపారి వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి వీటిని నిర్వహించినట్లు సమాచారం. దీనిపై పోలీసులు నిఘా ఉంచారు.

News February 24, 2025

HYD: నయన మనోహరంగా కూచిపూడి రంగ ప్రవేశం

image

సంపూర్ణ ప్రత్యక్ష, ఆర్‌కెస్ట్రాతో లక్ష్య రాచప్రోలు కూచిపూడి రంగ ప్రవేశం నయన మనోహరంగా జరిగింది. రవీంద్రభారతిలో త్రిష్ట కూచిపూడి ఆరాడమీ ఆధ్వర్యంలో జరిగిన ప్రముఖ నాట్య గురువు డా.అలేఖ్య పుంజాల శిష్యురాలు లక్ష్య రాచప్రోలు కూచిపూడి అరంగేట్రం చేశారు. మహాగణపతిని స్మరిస్తూ ప్రదర్శనకు శుభారంభం పలికి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ సృజన అమ్మ ఆనంద గాయనితో ప్రేక్షకులను కట్టిపడేశారు.

error: Content is protected !!