News September 17, 2025

HYD: పసిప్రాయంలోనే.. పోరాటంలో

image

1948 SEP 17..గౌలీపురా గల్లీ జనంతో నిండింది. అందరి దృష్టి స్వాతంత్ర్య సమరయోధుడు రాజ్‌ బహదూర్‌ గౌర్‌ చెల్లెలు అవ్‌ధీశ్‌ రాణి ఇంటి గుమ్మానికి వేలాడుతున్న రేడియోపైనే ఉంది. ‘HYD సంస్థానం భారత్‌లో విలీనమైంది’ అని ప్రకటించగానే ఎగిరి గంతేశారు. దీపావళికి ఇంటికొచ్చిన మగ్దూం, జావేద్‌ రిజ్వీలను పోలీసుల నుంచి కాపాడింది. ‘పాల్‌రాబ్సన్‌’ కోడ్‌తో సమరయోధులకు భోజనం, సమాచారం చేరవేసి పోరాటంలో 8ఏళ్లకే భాగమైంది.

Similar News

News September 17, 2025

కృష్ణా: రైలులో గంజాయి అక్రమ రవాణా.. ఒకరి అరెస్ట్

image

కృష్ణా జిల్లా వ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో, బిలాస్‌పూర్ నుంచి తిరుపతి వెళ్లే రైలులో 4.5 కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఒక వ్యక్తిని రామవరప్పాడు రైల్వే స్టేషన్‌లో అరెస్ట్ చేశారు. నిందితుడిని జీఆర్‌పీ పోలీసులకు అప్పగించారు. విచారణలో ఒరిస్సాలోని చాట్ల గ్రామంలో గంజాయి కొనుగోలు చేసి, చిత్తూరు జిల్లాలో విక్రయిస్తున్నట్లు అతడు తెలిపాడు.

News September 17, 2025

మేడారానికి ఓకే విడతలో రూ.150 కోట్లు: సీతక్క

image

ములుగు జిల్లా అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి సహకారం అందిస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు. మేడారం జాతరకు ఒకే విడతలో రూ.150 కోట్లు, రోడ్లకు రూ.50 కోట్లు ఇచ్చారని తెలిపారు. ములుగు పట్టణంలో పంచాయతీ రోడ్లకు రూ.40 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. అధికారులు ప్రజాపాలనలో భాగస్వామ్యం కావాలని కోరారు. ములుగు జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రణాళిక రూపొందించామని పేర్కొన్నారు.

News September 17, 2025

ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయండి: కలెక్టర్

image

మాచర్లలో ఈ నెల 20న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లపై బుధవారం కలెక్టర్ మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం చేశారు. పర్యటనను విజయవంతం చేయడానికి వివిధ శాఖల మధ్య సమన్వయం అవసరమని, అందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు.