News May 28, 2024
HYD: పిల్లలను ఎత్తుకెళ్లి.. రూ.లక్షలకు అమ్ముతున్నారు..!
HYD ఘట్కేసర్ పరిధి మేడిపల్లి పోలీసులు ఈరోజు <<13329773>>పిల్లలను ఎత్తుకెళుతున్న ముఠాను<<>> అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల మేడిపల్లి పరిధిలో ఓ చిన్నారిని అమ్ముతుండగా పోలీసులు పట్టుకోవడంతో ఈ ముఠా బాగోతం బయటపడింది. 16మందిని పోలీసులు కాపాడారు. కాగా పీర్జాదిగూడలో రూ.4.5లక్షలకు చిన్నారిని RMP శోభారాణి విక్రయించినట్లు పోలీసులు, CWCఅధికారులు తెలిపారు. ఆమెతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. జర జాగ్రత్త. SHARE IT
Similar News
News September 21, 2024
HYD: విద్యుత్ కనెక్షన్ల జారీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు: సీఎండీ
నూతన విద్యుత్ కనెక్షన్ల జారీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ అధికారులను హెచ్చరించారు. ఉన్నతాధికారులతో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రతివారం అధికారులు ఒకరోజు క్షేత్రస్థాయిలో పర్యటించి వినియోగదారులతో నేరుగా మాట్లాడాలన్నారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్లో చేపట్టిన పనులు డిసెంబర్ నాటికి వందశాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News September 21, 2024
HYD: రూ.6,661 కోట్లతో నాగపూర్ జాతీయ రహదారి
హైదరాబాద్-నాగపూర్ కారిడార్లోని 251KM హైవేను NHAI సంస్థ, హైవే ఇన్ఫ్రా స్ట్రక్చర్ ట్రస్ట్కు టోల్-ఆపరేట్- ట్రాన్స్ఫర్ (TOT) మోడల్లో రూ.6,661 కోట్లకు కేటాయించినట్లుగా తెలిపింది. HYD నగరం నుంచి నాగపూర్, నాగపూర్ నుంచి HYD వెళ్లే వాహనదారుల నుంచి TOT మోడల్లో టోల్ ఛార్జీలను వసూలు చేస్తారని అధికారులు పేర్కొన్నారు.
News September 21, 2024
HYD: ఫుట్ పాత్పై వ్యాపారం చేస్తే.. అంతే సంగతి!
HYD నగరంలో అనేక చోట్ల చిరు వ్యాపారులు ఫుట్ పాత్పై వ్యాపారం చేస్తున్నారు. వారందరికీ ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది. తాజాగా బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్రమ వ్యాపార సముదాయాలను అధికారులు తొలగించారు. వాటిలో పండ్ల దుకాణాలు, నర్సరీలు, గృహోపకర వస్తువుల దుకాణాలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఫుట్ పాత్పై వ్యాపారం చేయొద్దని సూచించారు.