News April 7, 2025

HYD: పుష్పక్ బస్సులకు రూట్ పాస్ ప్లాన్

image

సిటీలో వివిధ ప్రాంతాల నుంచి ఎయిర్ పోర్టుకు నడిపే పుష్పక్ బస్సులకు నడుపుతున్న సంగతి తెలిసిందే.  ప్రయాణికుల నుంచి స్పందన లేకపోవడం, కేవలం 60 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తుండడంతో రూట్ పాస్‌లు అందుబాటులోకి తేవాలని అధికారులు నిర్ణయించారు. సిటీ మొత్తం అయితే రూ.5,200, శంషాబాద్ టు ఎయిర్పోర్ట్ రూ.2,110, బాలాపూర్ టు ఎయిర్ పోర్టు రూ.3,100, ఎల్బీనగర్, గచ్చిబౌలి టు ఎయిర్పోర్టుకు రూ.4,210 ఖరారు చేయనున్నారు.

Similar News

News November 4, 2025

మీర్జాగూడ ఘటన.. TGSRTC తీవ్ర దిగ్ర్భాంతి

image

మీర్జాగూడ ఘటనపై TGSRTC తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. 19 మంది మృతిచెందగా, 25 మంది గాయపడ్డారు. అతివేగంగా వచ్చిన టిప్పర్ ఆర్టీసీ బస్సును ఢీకొట్టడం ప్రమాదానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. బస్సుకు ఫిట్‌నెస్ ఉందని, బస్సు డ్రైవర్‌కు ఎలాంటి యాక్సిడెంట్ రికార్డు లేదని ఆర్టీసీ స్పష్టం చేసింది. మృతుల కుటుంబాలకు TG ప్రభుత్వం రూ.5 లక్షలు, RTC రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిందని తెలిపింది.

News November 4, 2025

HYD: ఇన్వెస్ట్‌మెంట్ పేరిట మోసం.. ముగ్గురి అరెస్ట్

image

HYD సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ మోసాన్ని తాజాగా బట్టబయలు చేశారు. వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులతో రూ.లక్షల్లో ప్రజలను మోసగించిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఫేక్ ట్రేడింగ్ యాప్‌ల ద్వారా రూ.60 లక్షలకు పైగా వీరు కాజేశారు. బ్యాంక్ అకౌంట్లు సైబర్ నేరగాళ్లకు ఇచ్చి కమీషన్ తీసుకుంటున్నట్లు బయటపడింది. ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్లలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

News November 4, 2025

HYD: BRS పాలనలో అవకతవకలు: మంత్రి

image

HYDలోని తెలంగాణ సచివాలయంలో చేపపిల్లల పంపిణీపై మంత్రి వాకిటి శ్రీహరి ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నవంబర్ చివరికల్లా పంపిణీ పూర్తి చేయాలని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. చేపల తినడం వల్ల ఆరోగ్య లాభాలపై విస్తృత ప్రచారం చేయాలని, గత BRS ప్రభుత్వ పాలనలో పంపిణీలో అవకతవకలు జరిగాయని, ప్రతి చెరువు వద్ద పంపిణీ వివరాల సైన్‌బోర్డులు ఏర్పాటు చేసి, వివరాలను టి-మత్స్య యాప్‌లో అప్లోడ్ చేయాలన్నారు.