News March 28, 2024

HYD: పెరుగుతున్న ఉష్ణోగ్రతలు!

image

HYD, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్దలో 41.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మెయినాబాద్‌ మండలం కేతిరెడ్డిపల్లిలో 41.2 డిగ్రీలు, రెడ్డిపల్లిలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే మూడు రోజుల్లో 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగే ఆస్కారం ఉందని వాతవారణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అవసరమైతేనే ఇంటి నుంచి బయటికి రావాలని సూచించింది.

Similar News

News July 8, 2024

HYD: శిథిలావస్థలోని భవనాలపై చర్యలేవి!

image

గ్రేటర్ HYD పరిధిలో శిథిలావస్థలో ఉన్న భవనాలపై చర్యలు అంతంత మాత్రంగా ఉన్నాయి. గతేడాది అధికార గణంకాల ప్రకారం.. జీహెచ్ఎంసీ పరిధిలో 620 భవనాలు శిథిలంగా మారాయి. సికింద్రాబాద్లో అత్యధికంగా 155, ఎల్బీనగర్లో 119, చార్మినార్లో 89, ఖైరతాబాద్లో 109, శేరిలిం గంపల్లిలో 62, కూకట్‌పల్లిలో 92 శిథిల భవనాలు ఉన్నాయి. ఈ భవనాల స్థితిపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలకు పూనుకోలేదు.

News July 8, 2024

HYD నుంచి స్వర్ణగిరికి వెళ్లే బస్సుల TIMINGS ఇవే..!

image

HYD నుంచి యాదాద్రి సమీపంలోని స్వర్ణగిరి టెంపుల్‌కి రెండు ఎలక్ట్రిక్ మెట్రో ఎక్స్ ప్రెస్, నాన్ ఏసీ బస్సులను RTC నడిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు అధికారులు బస్ టైమింగ్స్ విడుదల చేశారు. సికింద్రాబాద్ JBS నుంచి ఉ.7, 8, మ.2.50, 3.50 గంటలకు బయలుదేరుతాయని, తిరిగి స్వర్ణగిరి నుంచి JBSకు మ.12.10, 1.10, రా.8, 9 గంటలకు బస్సులుంటాయన్నారు. JBS నుంచి రూ.100, ఉప్పల్ నుంచి రూ.80 టికెట్ ధరగా నిర్ణయించారు.

News July 8, 2024

HYD: MNJ క్యాన్సర్ ఆసుపత్రికి పేషెంట్ల తాకిడి

image

HYD నగరంలోని రెడ్ హిల్స్‌లోని MNJ క్యాన్సర్ ఆస్పత్రికి పేషెంట్ల తాకిడి పెరిగింది. నిత్యం ఓపీలు 600-700 నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు. వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి 350-400 మందికి కీమోథెరపీ, 200-250 మందికి రేడియో థెరపీ చేస్తున్నట్లు వివరించారు. ఏటా రోగులు గణనీయంగా 20% పెరుగుతున్నారని పేర్కొన్నారు.