News April 7, 2025

HYD: పేకాట కేసులో ఓ MLA సన్నిహితుడు..?

image

మేడ్చల్ PS పరిధిలో గత శనివారం అర్ధరాత్రి SOT 14 మంది బృందం పేకాట ముఠా గుట్టురట్టు చేసిన విషయం తెలిసిందే. మేడ్చల్ పరిధి పూడూరులోని ఓ ఫామ్ హౌస్‌లో దాడులు నిర్వహించగా ఇందులో 18 మంది పేకాట ఆడుతుండగా అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.4 లక్షలకు పైగా నగదు,16 ఫోన్లు,12 కారులను సీజ్ చేసినట్లు సమాచారం. ఈ కేసులో ఓ పార్టీ ఎమ్మెల్యే సన్నిహితుడు ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News April 8, 2025

రేవంత్, కేటీఆర్ ప్రాణమిత్రులు: బండి సంజయ్

image

TG: CM రేవంత్, KTR ప్రాణ మిత్రులని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. అందుకే కేటీఆర్ అరెస్ట్ కాకుండా CM కాపాడుతున్నారని ఆయన ఆరోపించారు. ‘రేవంత్, KTR కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. చెన్నైలో అఖిలపక్ష భేటీకి ఇద్దరూ కలిసే వెళ్లారు. HYD సమావేశం కూడా వీరే నిర్వహిస్తున్నారు. వీరిద్దరూ కలిసి BJPని దెబ్బ తీసేందుకు కుట్ర చేస్తున్నారు’ అంటూ సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

News April 8, 2025

దాది రతన్ మృతి పట్ల సీఎం సంతాపం

image

బ్రహ్మకుమారీల దాది రతన్ మోహిని జీ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. దాది మోహిని గ్లోబల్ సెంటర్ల చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ అని, దాది జీవితం ఆదర్శప్రాయమన్నారు. దాది మృతి రాష్ట్ర, దేశ, విశ్వ ఆధ్యాత్మికతకు తీరనిలోటని సీఎం పేర్కొన్నారు.

News April 8, 2025

రోహిత్ శర్మకు అరుదైన గౌరవం!

image

భారత కెప్టెన్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం దక్కనున్నట్లు తెలుస్తోంది. ప్రతిష్ఠాత్మక వాంఖడే స్టేడియంలో స్టాండ్స్, వాకింగ్ బ్రిడ్జిలకు ప్రముఖ ముంబై క్రికెటర్ల పేర్లు పెట్టాలని ముంబై క్రికెట్ అసోసియేషన్(MCA) భావిస్తోంది. ఓ స్టాండ్‌‌కు రోహిత్ శర్మ పేరిట నామకరణం చేయనున్నట్లు సమాచారం. మాజీ ప్లేయర్స్ అజిత్ వాడేకర్, ఏక్‌నాథ్ సోల్కర్, శివాల్కర్, డయానా ఎడుల్జీ తదితరుల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి.

error: Content is protected !!